Ayodhya: అయోధ్యలో దంచికొట్టిన వానలు.. ఇబ్బందుల్లో భక్తులు అయోధ్యలో గత రెండు రోజులుగా వానలు దంచికొట్టాయి. దీంతో రోడ్లపై మోకాళ్ల వరకు నీరు నిలిచిపోయింది. అయోధ్య రాముని దర్శనానికి వెళ్లిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రామమందిరం చుట్టూ హడావిడిగా నిర్మాణ పనులు చేపట్టడంతోనే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని స్థానికులు అంటున్నారు. By B Aravind 27 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి అయోధ్యలో వర్షం బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా వానలు దంచికొట్టాయి. దీంతో రోడ్లపై మోకాళ్ల వరకు నీరు నిలిచిపోయింది. అయోధ్య రాముని దర్శనానికి వెళ్లిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. రామమందీర్ సమీపంలోని జల్వాన్పురాలో ఇళ్లలోకి మురుగునీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామమందిరం చుట్టూ హడావిడిగా నిర్మాణ పనులు చేపట్టడంతోనే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని స్థానికులు అంటున్నారు. ఆలయం రూఫ్ నుంచి కూడా నీరు లీకయ్యాయి. అయితే మరో మూడు రోజుల పాటు అయోధ్యకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. Also Read: ముగిసిన ఉమ్మడి రాజధాని కాలపరిమితి.. వాటా కావాలంటున్న ఏపీ #rains #ayodhya #heavy-rains #telugu-news #ram-mandhir మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి