Telangana : ఇవాళ తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, అమిత్ షా

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్‌లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రూ.1000 ఫైన్
New Update

Rahul Gandhi : తెలంగాణ(Telangana) లో ఎన్నికల ప్రచారం(Election Campaign) ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ(BJP) అగ్రనేతలు రాష్ట్రానికి తరలివస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్‌లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు, ఇతర నేతలు హాజరుకానున్నారు. నిర్మల్‌లో భారీగా కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బహిరంగా సభలో ప్రధాన ఆకర్షణగా గాడిదగుడ్డును ఏర్పాటు చేశారు. ఎక్కువ ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది.

Also Read: రైతుబంధుపై మాటల యుద్ధం.. రేవంత్‌ VS బీఆర్ఎస్

మరోవైపు బీజేపీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఈరోజు ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇక సోమవారం నాడు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు.

Also Read: నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు అరెస్టు.. పాక్‌ ఐఎస్‌ఐతో సంబంధాలు

#amit-shah #2024-lok-sabha-elections #bjp #congress #rahul-gandhi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి