Bus Accident : ఖమ్మంలో బస్సు బోల్తా...15 మంది ప్రయాణికులు!

ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

New Update
Bus Accident : ఖమ్మంలో బస్సు బోల్తా...15 మంది ప్రయాణికులు!

Khammam : ఖమ్మం(Khammam) జిల్లా మద్దులపల్లి వద్ద ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు(Private Travels Bus) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

బోల్తా పడిన బస్సులో నుంచి ప్రయాణికులను బయటకు తీసి స్థానిక ఆసుపత్రులకు తరలించారు. బస్సు హైదరాబాద్‌(Hyderabad) నుంచి భద్రాచలం(Bhadrachalam) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని పోలీసులు ధృవీకరించారు. బస్సు బోల్తా పడటానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్‌ నిద్రలోకి జారుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక అతి వేగం వల్ల ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

Also Read : శివరాత్రి స్పెషల్‌ వీడియో… ఉపవాసం, జాగరణ చేసిన పవన్‌ పిల్లలు..వీడియో వైరల్‌!

Advertisment
తాజా కథనాలు