Pentapati Pulla Rao : తెలంగాణలో 2023 డిసెంబర్ 3న కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. కేసీఆర్(KCR) పని అయిపోయిందని, ఆయన పార్టీ కనుమరుగవుతుందనే ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. సీఎం రెవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో.. ఎంతోమంది బీఆర్ఎస్(BRS) నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. కేసీఆర్ ప్రతిష్ఠను దిగజార్చి.. బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడమే రేవంత్ లక్ష్యం. రేవంత్ ఒక చాకచక్యమైన రాజకీయ నేత. బీజేపీ వల్ల ముప్పు లేదని ఆయనకు అర్థమైంది. కానీ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వల్ల తనకు దీర్ఘకాలిక ముప్పు ఉందని తెలుసు. కాంగ్రెస్లో ఉన్న నాయకుల అదృష్టం ఎప్పుడైనా మారవచ్చు. కాంగ్రెస్ ఫేవరేట్ లిస్టులో తనది శాశ్వత స్థానం కాదని రేవంత్ కు తెలుసు. అహ్మద్ పటేల్కు ఇందిరా గాంధీ కాలం నుంచి.. గాంధీ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు రాజీవ్ గాంధీతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత 1988లో సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినప్పటి నుంచి ఆమెకు దగ్గరయ్యారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉనేనప్పుడు కూడా.. అహ్మద్ పటేల్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో ముఖ్య పాత్ర పోషించారు. కానీ 2015 తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడైనప్పుడు.. అహ్మద్ పటేల్ పూర్తిగా పక్కకు తప్పుకున్నారు. చివరికి 2020లో అహ్మద్ పటేల్ కరోనా బారిన పడి మృతి చెందారు. ఆయన చనిపోయినప్పుడు శవపేటిక వద్ద కాంగ్రెస్ నాయకులు లేరు. రేవంత్కు కాంగ్రెస్లో జరిగే అన్ని విషయాలు తెలుసు.
పూర్తిగా చదవండి..KCR : కేసీఆర్పై గౌరవం తగ్గలేదు!
బీఆర్ఎస్ నుంచి చాలమంది నేతలు వెళ్లిపోయిన కూడా ఆ పార్టీకి ఎలాంటి నష్టం లేదని.. పార్టీ కేడర్ మాత్రం కేసీఆర్తోనే ఉందని రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కొంతమేరకు ప్రభావం చూపించినా ఆయనకు ఇది విజయమేనని పేర్కొన్నారు.
Translate this News: