Olympics India Winner : రేపటితో ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారులందరూ దేశానికి చేరుకుంటారు. మొన్న ఆదివారం ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమం జరిగింది. దీంతో అందరూ ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన క్రీడాకారులు కూడా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది భారత్కు తిరిగి రాగా…మరికొంత మంది మాత్రం ఈరోజు వస్తారు. ఈ నేపథ్యంలో భారత్కు పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధాని మోదీ భేటీ అవ్వనున్నారని తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో భారత స్వతంత్ర దినోత్సవం వస్తోంది. అదే రోజు మధ్యాహ్నం అథ్లెట్లను ప్రధాని మోదీ కలుస్తారని చెబుతున్నారు. పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగాయని తెలిసిందే. భారత్ నుంచి117 మంది సభ్యులతో కూడిన బృందం పారిస్కు వెళ్లింది. అందులో చాలా మంది అథ్లెట్లు తిరిగి వచ్చారు.
పూర్తిగా చదవండి..Olympics Winners: ఆగస్టు 15న ఒలింపిక్స్ విజేతలతో ప్రధాని భేటీ
పారిస్ ఒలింపిక్స్ అయిపోయాయి. అందరూ స్వదేశాలకు తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో భారత్కు తిరిగివచ్చిన అథ్లెట్లను భారత ప్రధాని మోదీ ఆగస్టు 15న కలవనున్నారని సమాచారం. పతకాలు సాధించిన వారితో ప్రధాని భేటీ కానున్నారు.
Translate this News: