PM Modi: లోక్సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికీ అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓవైపు మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ.. మరోవైపు మోదీ సర్కార్ను గద్దె దించాలని ఇండియా కూటమితో సహా ఇతర విపక్ష పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీల నేతలు ఎన్నికల రణరంగంలోకి దిగారు. ప్రధాని మోదీ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. తాజాగా జార్ఖండ్లోని ధన్బాద్లో శుక్రవారం నిర్వహించిన ర్యాలీని ఉద్దేశిస్తూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..PM Modi: భారత్ అభివృద్ధి చెందేది అప్పుడే: ప్రధాని మోదీ
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. జార్ఖండ్లోని శుక్రవారం నిర్వహించిన ర్యాలీని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Translate this News: