Telangana: కేసీఆర్‌ చేసిన అతిపెద్ద తప్పులు అవే.. పటోళ్ల కార్తిక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్‌ నుంచి పలువురు నేతలు వెళ్లపోవడంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తిక్‌ రెడ్డి కీలక కామెంట్స్‌ చేశారు. కె.కేశవరావు, ఆయన కుమార్తె విజయలక్ష్మీ, కడియం శ్రీహరిలకు పదవులు అప్పగించి కేసీఆర్‌ పెద్ద తప్పు చేశారని పార్టీ సమావేశంలో అన్నారు.

New Update
Telangana: కేసీఆర్‌ చేసిన అతిపెద్ద తప్పులు అవే.. పటోళ్ల కార్తిక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Karthik Reddy: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నుంచి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా మంది నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలోకి (Congress Party) చేరారు. తాజాగా కడియం శ్రీహరి (Kadiyam Srihari), ఆయన కుమార్తె కావ్య, కే.కేశవరావు (K Keshavarao), ఆయన కుమార్తె మేయర్ విజయలక్ష్మీ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీళ్లందరూ శనివారం కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తిక్‌ రెడ్డి కీలక కామెంట్స్‌ చేశారు.

Also Read: ఆ 2 డిమాండ్లకు కాంగ్రెస్ ఓకే.. కడియం ఫుల్ హ్యాపీ!

' కె.కేశవరావును కేసీఆర్‌ (KCR) తన పక్కన కూర్చోపెట్టుకోవడమే పెద్ద తప్పు. ఆయనను రాజ్యసభ సభ్యనిగా చేయడం కేసీఆర్‌ చేసిన అతిపెద్ద తప్పు. కేశవరావు కుమార్తె విజయలక్ష్మికి మేయర్ పదవి కట్టబెట్టడం మరో తప్పు. ఆమెకు బంజారాహిల్స్‌ ఎక్కడ ఉందో కూడా తెలీదు. అసలేమి తెలియని విజయలక్ష్మికి.. కేసీఆర్‌ రెండు సార్లు కార్పొరేటర్‌ అవకాశం కల్పించడం తప్పు. కడియ శ్రీహరికి మంచి స్థానాన్ని కట్టబెట్టం కేసీఆర్‌ చేసిన మరో పెద్ద తప్పు. పార్టీలో నాకు పెద్దగా పదవులు రాలేదు. అయినా నేను పార్టీ వెంటే నడిచానని' కార్తీక్‌ రెడ్డి అన్నారు.

అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) నుంచి నేతలు వెళ్లిపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశవుతోంది. ఇక మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు కూడా జరగనున్నాయి. మే 13న తెలంగాణలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ.. ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపొందేందుకు వ్యూహాలు రచిస్తోంది.

Also read: గురుకులాల్లో మిగిలిన పోస్టులు భర్తీ చేయండి: హైకోర్టు

Advertisment
తాజా కథనాలు