కొత్త పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధం అయింది. భేటీలో మొదటి రోజు 75 ఏళ్ళ ప్రయాణం మీద చర్చించనున్నారు. దీంతో పాటూ పలు కీలక బిల్లుల కూడా చర్చిస్తారని తెలస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాడే కొత్త బిల్డింగ్ గజద్వారం మీద ఉపరాష్ట్రపతి, రాజ్య సభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక మంగళవారంనాడు ఎంపీలందరికీ ప్రత్యేక ఫోటో సెషన్ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యులంతా ఆరోజు ఉదయం 9.30 గంటలకు గ్రూప్ ఫోటో సెషన్ కు అటెండ్ కావాలని లోక్ సభ సెక్రటేరియట్ కోరింది.
పూర్తిగా చదవండి..ఈరోజు నుంచే పార్లమెంట్ ప్రత్యేక భేటీ.
కొత్త పార్లమెంట్ లో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాలు ఈరోజు నుంచే మొదలవుతున్నాయి. ఐదు రోజులపాటూ ఈ సమావేశాలు జరగుతాయి. ఈరోజుకి పాత బిల్డింగ్ లోనే భేటీ జరుగుతుంది. రేపు వినాయకచవితి సందర్భంగా కొత్త పార్లమెంటుకు ఉభయ సభలూ మారతాయి.
Translate this News: