Germany : భారత స్టార్ జావెలిన్ త్రో (Javelin Throw) ప్లేయర్ నీరజ్ చోప్రా ఇప్పుడు మిగతా అథ్లెట్లతో పాటూ ఇండియా (India) కు తిరిగి రావడం లేదు అతను పారిస్ నుంచి జర్మనీ వెళుతున్నాడు. ఒలింపిక్స్లో పాల్గొనక ముందు నుంచే నీరజ్ గజ్జల్లో గాయం కారణంగా బాధపడుతున్నాడు. ఈ గాయం కాస్తా పెద్దది అవ్వడం వల్లనే బంగారు పతకాన్ని కూడా కోల్పోవలసి వచ్చిందని నీరజ్ చెప్పాడు. ఇప్పుడు దీనికి శస్త్రచికిత్స చేయించుకోవడానికే అతను జర్మనీ వెళుతున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటూ రాబోయే డైమండ్ లీగ్లో పాల్గొనాలా వద్దా అనే విషయానికి సంబంధించి కూడా వైద్య సలహా తీసుకోనున్నాడు. దీంతో నీరజ్ మరో 45 రోజులు కనీసం భారత్కు తిరిగి వచ్చే అవకాశం లేదని అతని బంధువులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Sports : పారిస్ నుంచి జర్మనీకి… నెల తరువాత భారత్కు నీరజ్ చోప్రా
భారత అథ్లెట్ , రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ నుంచి డైరెక్ట్గా జర్మనీ వెళ్ళనున్నాడు. నెల రోజులు అక్కడే ఉండి భారత్కు తిరిగి రానున్నాడు. తన గాయానికి ఆపరేషన్ చేయించుకోవడానికే నీరజ్ అక్కడికి వెళ్తున్నాడని తెలుస్తోంది.
Translate this News: