Maharashtra: అర్ధరాత్రిళ్లు ఆ మేసేజ్‌లు చేయడం అశ్లీలతే: కోర్టు

పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రి మెసేజ్‌లు చేస్తే అది అశ్లీలత కిందకే వస్తుందని ముంబై సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఓ మాజీ కార్పొరేటర్‌కు అశ్లీల మెసజ్‌లు పంపాడనే కేసులో ఓ వ్యక్తికి విధించిన కింది కోర్టు శిక్షను మంబై కోర్టు సమర్థించింది.

New Update
Whatsapp Messages

Whatsapp Messages

ముంబై సెషన్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రి మెసేజ్‌లు చేస్తే అది అశ్లీలత కిందకే వస్తుందని తెలిపింది. ఓ మాజీ కార్పొరేటర్‌కు అశ్లీల మెసజ్‌లు పంపాడనే కేసులో ఓ వ్యక్తికి విధించిన కింది కోర్టు శిక్షను మంబై కోర్టు సమర్థించింది.  ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని బోరివలీ ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్‌కు 2016 జనవరిలో నార్సింగ్ గుడే అనే వ్యక్తి వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు.   

మీరు చూడటానికి బాగుంటారు, మీరంటే, ఇష్టం, మీకు పెళ్లైందా అంటూ అర్ధరాత్రుళ్లు సందేశాలు పంపాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. నార్సింగ్‌ను అరెస్టు చేశారు. ఆరేళ్ల తర్వాత మెజిస్ట్రేట్ కోర్టు అతడిని దోషిగా తేల్చింది. మూడు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో ఈ శిక్షను అతడు సవాల్ చేశాడు.  ట్రయల్‌ కోర్టు తీర్పును కూడా తాజాగా సెషన్స్‌ కోర్టు సమర్థించింది. 

Also Read: పదవ తరగతి పరీక్షల్లో చీటింగ్‌ జరిగిందని తుపాకులతో కాల్పులు.. ఒకరు మృతి

''మీరంటే నాకిష్టం, చూడటానికి బాగున్నారు, అందంగా ఉన్నారు, మీకు పెళ్లయిందా? లేదా? మీరు సన్నగా ఉన్నారు అంటూ ఇలా పరిచయం లేని మహిళలతో అర్ధరాత్రిళ్లు మెసేజ్‌లు చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి చర్య అశ్లీలత కిందకే వస్తుది. సొసైటీలో పేరున్న వాళ్లు, వాళ్ల భాగస్వాములు ఇలాంటి వాటిని తట్టుకోలేరు. ముఖ్యంగా ఒకరికొకరు పరిచయం లేనప్పుడు ఇంకా అస్సలు తట్టుకోలేరని'' అడిషనల్ సెషన్స్ జడ్జి డీజీ ధోబ్లే అన్నారు. 

Also Read: మరో మీర్ పేట మర్డర్.. 20 ఏళ్లుగా ఫ్రిజ్ లోనే పుర్రె, అస్థి పంజరం.. ఆ డెడ్ బాడీ ఎవరిది?

మరోవైపు రాజకీయ కక్షతోనే ఆమె తనపై తప్పుడు కేసు పెట్టించిందని ఆ వ్యక్తి వాదించాడు. కానీ అతడి వాదనలు కోర్టు తోసిపుచ్చింది. ఏ మహిళా తెలిసి కూడా తప్పుడు కేసుతో తన పరువును పణంగా పెట్టాలనుకోదని తెలిపింది. నిందితుడు బాధిత మహిళకు వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసినట్లు రుజువైందని.. అందుకే ట్రయల్ కోర్టు విధించిన శిక్షకు అతడు అర్హుడని సెషన్స్‌ కోర్టు తేల్చిచెప్పింది. 

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. స్పాట్‌లోనే 9మంది మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు