Air India Flight Crash : విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాల సంతాపం

ఎయిర్ ఇండియా ప్రమాదం మనదేశంతో పాటు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో సుమారు 240 మందికి పైగా మరణించడం అందరినీ కలిచివేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం పై ప్రపంచ దేశాలన్ని తమ సంతాపాన్ని తెలియ జేస్తున్నాయి.  

New Update
All 242 people on board Air India flight killed

All 242 people on board Air India flight killed

Air India Flight Crash : ఎయిర్ ఇండియా ప్రమాదం మనదేశంతో పాటు ప్రపంచ దేశాలను దిగ్ర్భాంతికి గురి చేసింది. ఈ ప్రమాదంలో సుమారు 240 మందికి పైగా మరణించడం అందరినీ కలిచివేసింది.  గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంతో ప్రపంచ దేశాలన్ని తమ సంతాపాన్ని తెలియ జేస్తున్నాయి.  ఈ ప్రమాదంలో భారతీయులతో పాటు విదేశీయులు సైతం ఉన్నారు. దీంతో ఆయా దేశాలు తమ వారి మృతి పట్ల ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో యూకే, కెనడా, పోర్చుగల్‌ ఇలా ఇతర దేశ ప్రయాణికులు కూడా ఉన్నారు. ముఖ్యంగా విమాన ప్రమాదంలో 53 మంది బ్రిటిష్ జాతీయులు ఉన్నారు. దీంతో విమాన ప్రమాదంపై యూకే ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. “చాలా మంది బ్రిటిష్ జాతీయులతో లండన్ వస్తున్న విమానం భారత్ లోని అహ్మదాబాద్ నగరంలో కూలిపోయిన దృశ్యాలు విషాధకరమైనవి” అని రాసుకొచ్చారు. విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతిని వ్యక్తం చేశారు.  ప్రమాదానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది, ఈ తీవ్ర బాధాకరమైన సమయంలో ప్రయాణికులు, వారి కుటుంబాలతో వెన్నంటి ఉంటానని ఆయన పోస్ట్‌ చేశారు.

 ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ‘ఎక్స్‌’ వేదికగా బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. భారత్‌లో జరిగిన విమానం ప్రమాదం బాధాకరం. ఈ ప్రమాదంలో యూకే, కెనడా, పోర్చుగల్‌ ఇలా ఇతర దేశ ప్రయాణికులు కూడా ఉన్నారు. వీరంతా ప్రమాదానికి గురి అయినందుకు చింతిస్తున్నాను. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. - అంటూ జెలెన్‌స్కీ ఎక్స్‌ వేదికలో స్పందించారు. భారత్‌లో జరిగిన విమాన ప్రమాదం మమ్మల్ని ఎంతో బాధించింది. బాధితులు త్వరగా కోలుకోవాలి. అంటూ - భారత్‌లోని కెనడా హైకమిషన్‌ ట్వీట్‌ చేశారు.

అహ్మాదాబాద్‌ సమీపంలో ఎయిరిండియా విమానానికి జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తున్నామని మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు గుజరాత్‌లో జరిగిన విమాన ప్రమాదం హృదయవిదారకం. ఈ బాధిత కుటుంబాలు కోలుకోవాలని ఆశిస్తున్నా. - అంటూ యూరోపియన్‌ కమిషన్‌ చీఫ్‌ ఉర్సులా తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు