Atishi: ఢిల్లీని నడిపే సత్తా బీజేపీకి లేదు.. అతిషి విమర్శలు

ఢిల్లీ సీఎం అభ్యర్థిని ఇంకా బీజేపీ ప్రకటించకపోవడంతో ఆప్ నేత అతిషి స్పందిచారు. సీఎం పదవిని చేపట్టి ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం గల నేతలు ఎవరూ లేరని విమర్శించారు.అందుకే బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించడం లేదని ఎద్దేవా చేశారు.

New Update
Atishi marlena

Atishi marlena

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. ఫలితాలు వచ్చి దాదాపు 10 రోజులు అవుతున్న సీఎం ఎవరూ అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ఢిల్లీ ఆపద్ధర్మ సీఎం, ఆప్ నేత అతిషి బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిని చేపట్టి ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం గల నేతలు ఎవరూ లేరని విమర్శించారు. అందుకే బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించడం లేదని సెటైర్లు వేశారు. 

Also Read:  'చైనాను శత్రువులా చూడొద్దు'.. శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరిపై కూడా ప్రధాని మోదీకి నమ్మకం లేదని విమర్శించారు. అందుకే సీఎం పేరును ప్రకటించేందుకు జంకుతున్నారని దుయ్యబట్టారు. దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం లేనివాళ్లు ప్రజల అభివృద్ధి కోసం ఎలా పనిచేస్తారంటూ అతిషి ప్రశ్నల వర్షం కురిపించారు. 

Also Read: రైల్వే స్టేషన్‌తో తొక్కిసలాట.. బిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేసిన మహిళా కానిస్టేబుల్

ఇదిలాఉండగా ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 20న సాయంత్రం 4.30 గంటలకు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక న్యూఢిల్లీ నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తర్వాత సీఎం రేసులో విజయేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్, ఆశిష్ సూద్‌, పవన్ శర్మ తదితరులు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. 

Also Read: ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..?

 మరోవైపు డిప్యూటీ సీఎం పదవిని ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అందుకే ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇదే ఫార్ములాను పాటించాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాల్లో గెలిచి తన 27 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. ఆప్‌ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్‌ వరుసగా మూడోసారి కూడా ఖాతా తెరవలేకపోయింది. 

Also Read: పార్లమెంటులో అబద్ధాలు.. ఎంపీకి రూ.9లక్షల జరిమానా

Advertisment
Advertisment
తాజా కథనాలు