Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి? ఈ పేరే ఎందుకు పెట్టారు?

భారత్‌ను భరతమాతతో పోల్చగా కశ్మీర్‌ను తలగా భావిస్తారు. భరతమాత నుదుటిపై దాడి చేయడంతో రక్తాన్ని సింధూరంగా భావించి ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టారు. అలాగే ఈ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు సింబాలిజంగా చూపిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడి చేసింది.

New Update
Operation Sindoor

Operation Sindoor

ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ కలిసి పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేసింది. ఈ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు కూడా చనిపోయారు. అయితే ఈ వైమానిక దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి? ఈ పేరు పెట్టడానిక గల కారణాలు ఏంటో చూద్దాం.  

ఇది కూడా చూడండి: Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

ఇది కూడా చూడండి: BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

భారతీయుల రక్తాన్ని..

భారత్‌ను భరతమాతతో పోల్చుతారు. ఇందులో జమ్మూకశ్మీర్ దేశానికి తల వంటిది. ఇలాంటి కశ్మీర్‌లో ఉగ్రవాదులు పహల్గాం దాడి చేయడంతో 28 మంది టూరిస్ట్‌లు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే భరతమాత నుదుటిపై ఈ దాడి జరిగినట్లుగా కేంద్రం భావించించింది. ఈ ఉగ్రదాడిలో చనిపోయిన భారతీయుల రక్తాన్ని సింధూరంతో పోల్చారు. అందుకే దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!

అలాగే పహల్గాం దాడిలో ఉగ్రవాదులు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేశారు. మతపరమైన కారణంతో హతం చేయడంతో భారత్ సింధూరాన్ని ముఖ్యంగా తీసుకుంది. మహిళలకు సింధూరం చాలా ముఖ్యమైనది. దీన్ని నుదుటిపై పెట్టుకుంటారు. ఈ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు సింబాలిజంగా చూపిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేశారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: పాక్ పై భారత్ మెరుపు దాడి.. 30కి పైగా ఉగ్రవాదులు హతం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు