Plane Crash : ఇకపై ఎయిర్ ఇండియా విమానం ఎక్కను...వార్నర్ సంచలన ప్రకటన

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. విమాన ప్రమాదంపై స్పందించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్‌ వార్నర్‌ ఎయిర్‌ఇండియాపై సంచలన ప్రకటన చేశారు. ఇకమీదట తాను ఎయిర్‌ ఇండియా విమానాలు ఎక్కబోనని తేల్చి చెప్పారు.

New Update
David Warner

David Warner

Plane Crash :  అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు తమ దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రమాదంపై ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్‌ వార్నర్‌ స్పందించాడు.ఎయిర్‌ఇండియాపై సంచలన ప్రకటన చేశారు. ఇకమీదట తాను ఎయిర్‌ ఇండియా విమానాలు ఎక్కబోనని తేల్చి చెప్పారు. అయితే ఆయన అలా అనడానికి కారణం ఉంది.  ఎయిర్ ఇండియాలో పనిచేసిన వివేక్‌ అనే ఒక మాజీ ఉద్యోగి ఆ సంస్థపై తీవ్ర ఆరోపణలు చేశారు. బోయింగ్‌ విమనాల్లో చాలా సంవత్సరాలుగా సమస్యలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఎయిర్‌ ఇండియా సమస్యలపై పైలట్లు, ఇంజినీర్లు, క్రూ సిబ్బంది అంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారని, ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి సైతం తీసుకు వెళ్లారని వివరించారు. అయినా యాజమాన్యం పట్టించుకోలేదంటూ ఆయన ఓ వీడియో కింద కామెంట్‌ చేశాడు. ఈ కామెంట్ చదివిన వార్నర్‌ఆ స్క్రీన్ షాట్‌ను షేర్‌ చేస్తూ ఒకవేళ ఇది నిజమైతే, నేను ఇకమీదట ఎయిర్ ఇండియా విమానం ఎక్కను" అంటూ పోస్ట్ చేశారు. దీంతో డేవిడ్ వార్నర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 టీం ఇండియా నివాళి


అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతిచెందిన వారికి టీంఇండియా నివాళి అర్పించింది. జూన్ 20 నుంచి 5 టెస్టుల సిరీస్ ఆడేందుకు టీం ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది.ఈ సందర్భంగా బెకేన్‌హమ్‌లో ఈ రోజు ఇంగ్లాండ్‌తో ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడుతోంది. ఈ ఆటకు ముందు టీంఇండియా ఆటగాళ్లు, సిబ్బంది అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు 2 నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఆటగాళ్లంతా చేతికి నల్లటి బ్యాండ్స్ ధరించి ఆటలో పాల్గొన్నారు. వీరితో పాటు లార్డ్స్ మైదానం వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న WTC ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్లు విమాన ప్రమాద మృతులకు సంతాపం తెలిపి చేతికి నల్ల రిబ్బన్లు ధరించి నివాళి అర్పించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు