/rtv/media/media_files/2025/02/15/P0HVRX98tGV6DIm0FCLR.jpg)
Delhi Metro Station
మెట్రో రైల్వే స్టేషన్లోని ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్లపై నుంచి కొందరు ప్రయాణికులు దూకిన ఘటన దుమారం రేపింది. ఢిల్లీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులు గేట్లు దూకుతూ సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు నుంచి తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై తాజాగా మెట్రో రైల్ కార్పొరేషన్ క్లారిటీ ఇచ్చింది.
Also Read: మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం..కాలి బూడిదైన గుడారాలు...
Delhi Metro Rail Corporation (DMRC) tweets
— Avinash K S🇮🇳 (@AvinashKS14) February 15, 2025
"In reference to a viral video circulating on social media regarding some passengers jumping over AFC gates to exit, DMRC would like to inform that said incident is reported from Jama Masjid Metro station on Magenta Line on the
+1 pic.twitter.com/uJpXLVRvy3
''ఫిబ్రవరి 13న జామా మసీదు మెట్రో స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. అక్కడ ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో కొందరు వ్యక్తులు ఇలా గేట్లు దూకి వెళ్లారు. ఇది వాళ్ల క్షణికమైన ప్రతిచర్య. భద్రా సిబ్బంది, ఇతర సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. అక్కడ పరిస్థితి అదుపు తప్పలేదని''ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. అలాగే ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!
Also Read: భూమిపైకి వచ్చాక సునీతా విలియమ్స్కు ఎదురుకానున్న ఇబ్బందులు