/rtv/media/media_files/2025/02/19/DlZkO5goQPAxuI1NKfVV.jpg)
_Kumbh Mela baths for the prisoners Photograph: (_Kumbh Mela baths for the prisoners)
ఉత్తరప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 144 ఏళ్లకు ఓసారి వచ్చే మహాకుంభమేళాలో ఖైదీల పాపాలు కడిగేయాలని ఆలోచిస్తోంది. కుంభమేళాలో పాల్గొనాలనుకునే వారికోసం చరిత్రలో ఫస్ట్ టైం ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇందుకుగాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75 జైళ్లలో శిక్ష అణుభవిస్తున్న 90వేలకు పైగా ఖైదీలకు పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించనుంది యూపీ సర్కార్.
उन्नाव ज़िला जेल में बंद बंदियों की इच्छा भी कुंभ स्नान की थी। जेल प्रशासन ने एक मटकी में संगम का जल मंगवाया। गंगा मैया के जयकारों के साथ बंदियों से स्नान किया। स्नानार्थियों पर फूल फेंके गए। #Unnao #MahaKumbh2025 #KumbhMela2025 @NBTLucknow pic.twitter.com/otlmDOnt9A
— Praveen Mohta (@MohtaPraveenn) February 18, 2025
యోగి ఆధిత్యానాథ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖైదీల కుంభమేళా స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఫిబ్రవరి 21న ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం నుంచి పవిత్ర జలాల్ని రాష్ట్రంలో జైళ్లుకు తీసుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. పవిత్ర గంగానది జాలాల్ని కారాగారాల్లోని నీటితో కలుపుతామని రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి దారా సింగ్ చౌహన్ వివరించారు. వాటితో ఖైదీలు కుంభమేళా పుణ్యస్నానాలు ఆచరించవచ్చని చెప్పుకొచ్చారు ఆయన.
Also Read : కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు బిగ్ రిలీఫ్.. ముడా స్కామ్లో లోకాయుక్తా క్లీన్ చీట్
ఈ కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొంటున్నట్లు జైళ్ల శాఖ మంత్రి దారా సింగ్ తెలిపారు. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాకుంభమేళా మరో 7 రోజుల్లో ముగియనుంది. ఇప్పటివరకు 55 కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్