విదేశీ అతిథుల సమయంలోనే ఉగ్రదాడులు.. నాడు క్లింటన్‌.. నేడు జేడీ వాన్స్‌!

దేశంలో విదేశీ అతిథుల పర్యటన సమయంలోనే ఉగ్రదాడులు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు జరగ్గా.. ఇప్పుడు జేడీ వ్యాన్స్ పర్యటనలో ఉండగా జరిగింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే ఈ దాడులు చేశాయని భావిస్తున్నారు.

New Update

దేశంలో విదేశీ అతిథుల పర్యటనకు వచ్చినప్పుడే ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారని అనుమానాలు వస్తున్నాయి. భారత ప్రధాని విదేశీ పర్యటనలో ఉండటం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ పహల్గాం ఉగ్రదాడి జరిగింది. అయితే ఇలా దాడి జరగడం ఇదేం మొదటిసారి కాదు.

ఇది కూడా చూడండి: Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!

ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

విదేశీ అధ్యక్షుడు పర్యటనలో ఉన్నప్పుడే..

గతంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి దాడే జరిగింది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే ఉద్దేశంతో పాక్ దాడికి పాల్పడింది. 2000లో మార్చి 20వ తేదీన అనంత్‌నాగ్ జిల్లాలో ఛత్తీసింగ్‌ పొరలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మొత్తం 36 మంది ప్రాణాలు కోల్పోయారు. సైనికులు అని చెప్పుకుని ఇంటింటికి వెళ్లి కేవలం పురుషులను మాత్రమే బయటకు రమ్మన్నారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఆ తర్వాత వచ్చిన వారిని వరుసగా కాల్చి చంపేశారు. దీని వెనుక పాక్‌ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇప్పుడు జేడీ వాన్స్ ఇండియా పర్యటనలో ఉన్నప్పుడు మళ్లీ ఈ దాడికి పాల్పడ్డారు. ఛత్తీసింగ్‌పొర దాడికి, ఈ పహల్గామ్ ఉగ్రదాడికి కాస్త లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా దళాల దుస్తుల్లో వచ్చి.. టూరిస్ట్‌ల ఐడీలను పరిశీలించి మరి చంపేశారు.

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు