ఆపరేషన్ చేస్తుండగా హాస్పిటల్‌లో పవర్ కట్.. చివరికి

పేషెంట్‌కు ఆపరేషన్ చేస్తుండగా హాస్పిటల్‌లో 15 నిమిషాల పాటు కరెంట్ పోయింది. ఈ ఘటన పంజాబ్‌ పాటియాలాలోని రాజింద్ర హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. డాక్టర్లు దీనిపై ఫైర్ అవుతున్నారు. వపర్ కట్‌పై ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ స్పందించారు.

New Update
panjab hospitel

panjab hospitel Photograph: (panjab hospitel)

గవర్నమెంట్ హాస్పిటల్‌లో పేషెంట్‌కు ఆపరేషన్ చేస్తుండగా కరెంట్ కట్ అయ్యింది. ఎమెర్జెన్సీ లైట్లతో సహా అన్నీ లైట్లు ఆగిపోయాయి. డాక్టర్లు ఆపరేషన్ ఆపియేయాల్సి వచ్చింది. పంజాబ్‌లోని పాటియాలాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. పాటియాలాలోని రాజింద్ర హాస్పిటల్‌లో జరిగిన సంఘటన గురించి ఓ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతుంది. డాక్టర్లు ఆపరేషన్ థియేటర్‌లో పేషెంట్ చుట్టూ నిలబడి ఉన్నారు. పేషెంట్‌కు ఏమైనా అవుతుందా అని అనుమానంతో అక్కడున్న డాక్టర్లు వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పంజాబ్ హెల్త్ మినిస్టర్ స్పందించారు.

ఇది కూడా చదవండి: ASAD: అసదుద్దీన్‌ ఓవైసీకి బిగ్‌షాక్.. సస్పెన్షన్‌ వేటు!

ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ ఆసుపత్రిలో పవర్ బ్యాకప్ సిస్టమ్‌లు ఉన్నాయని చెప్పారు. కేలవం డాక్టర్లు భయపడి వీడియో రికార్డ్ చేశారని.. వపర్ కట్ కూడా 56 సెకన్లే పోయిందని వివరణ ఇచ్చారు. ఆసుపత్రి సిబ్బంది ప్రతిక్షణం పేషెంట్ల సంరక్షణపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఇలాంటి సందర్భాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

ఇది కూడా చదవండి: Biggest Flop Movie: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆర్టిస్టు బయోపిక్‌.. రూ.800 కోట్ల నష్టం!

వీడియోలో మాత్రం డాక్టర్ 15 నిమిషాల పాటు కరెంట్ పోయిందని, అదే సమయంలో ఇన్వెటర్ కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగికి ఏదైనా జరిగితే, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వా్న్ని ప్రశ్నించారు. డాక్టర్లు, హాస్పిటల్ స్టాఫ్ అంతా ఇక్కడే నిలబడి ఉన్నారు. వెంటిలేటర్ ఆఫ్ చేశారని డాక్టర్ చెప్పారు. మూడు బ్యాకప్ జనరేటర్లు ఉన్నప్పటికీ, ఆసుపత్రిలో తరచుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు