Crime: దారుణం.. కన్న కూతురినే కాల్చి చంపిన తండ్రి

హర్యాణాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారణి అయిన రాధికా యాదవ్ (25)ను కన్న తండ్రే కాల్చి చంపాడు. ఆమె సోషల్ మీడియాలో రీల్‌ చేయడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన హత్య చేసినట్లు తెలుస్తోంది.

New Update
Radhika Yadav, state-level tennis player, shot dead by father in Haryana's Gurugram

Radhika Yadav, state-level tennis player, shot dead by father in Haryana's Gurugram

హర్యాణాలో దారుణం జరిగింది. ఓ టెన్నిస్ క్రీడాకారిణిని కన్న తండ్రే కాల్చి చంపడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారణి అయిన రాధికా యాదవ్ (25) గురుగ్రామ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. గురువారం ఆమె ఇంట్లో వంట చేస్తోంది. ఈ సమయంలోనే తండ్రి దీపక్ యాదక్‌ వెనక నుంచి ఆమెపై తుపాకితో కాల్పులు జరిపాడు. 

Also Read: ఆ ఒక్కచోటే 14,542 మంది మహిళల్లో క్యాన్సర్‌ లక్షణాలు

ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు. దీంతో రాధిక ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే రాధిక సోషల్ మీడియాలో రీల్‌ చేయడంతో దీనిపై తండ్రితో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన తండ్రి కూతురిని కాల్చి చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.

Also read: 2029 నాటికి 40లక్షల HIV మరణాలు.. ఐరాస ఆందోళన

Advertisment
Advertisment
తాజా కథనాలు