Snake Video : వామ్మో.. రైల్లోనే ప్రత్యక్షమైన పాము.. వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ నుంచి ముంబయికి వెళ్తున్న రైలులో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులకు సమాచారం అందిచగా వాళ్లు పామును పట్టుకొని బయట వదిలేశారు.

author-image
By B Aravind
Snake
New Update

సాధారణంగా పామును చూస్తే కొందరు భయంతో పరుగులు తీస్తారు. వ్యవసాయ క్షేత్రాల్లో, చెట్ల పొదల్లోనే కాదు.. అప్పుడప్పుడు పలువురి ఇళ్లల్లోకి కూడా పాములు దూరుతుంటాయి. కొంతరైతే పామును చూశాక చంపేస్తుంటారు కూడా. మరికొందరు అడవిలోకి వదిలేస్తుంటారు. అయితే మహారాష్ట్రలో మాత్రం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా నడుస్తున్న రైల్లోనే ఒక్కసారిగా పాము ప్రత్యక్షమయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జబల్‌పుర్‌- ముంబయి గరీబ్‌రత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది.  

Also Read: ఆహారంలో బతికి ఉన్న ఎలుక...విమానం అత్యవసర ల్యాండింగ్‌!

ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గరీబ్‌రత్‌ అనే ఎక్స్‌ప్రెస్‌ రైలు జబల్‌పుర్‌ నుంచి ముంబయికి బయలుదేరింది. అయితే మహారాష్ట్రలోని కాసర రైల్వే స్టేషన్‌ను రైలు చేరుకునే సమయంలో ఏసీ కోచ్‌ జీ-3లో ఒక్కసారిలో పాము ప్రత్యక్షమైంది. పైన బెర్త్‌ హ్యాండిల్‌కు చుట్టుకొని కాసేపు అలాగే ఉండిపోయింది. దాన్ని చూసి భయపడ్డ ప్రయణికులు వేరే కోచ్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఆ పామును పట్టుకొని బయట వదిలేశామని స్పష్టం చేశారు. 

#mumbai #snake #train
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి