దారుణం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం

మహారాష్ట్రలోని ముంబయిలో దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఒకే కుటంబంలో ఏడుగురు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Death
New Update

మహారాష్ట్రలోని ముంబయిలో దారుణం చోటుచోసుకుంది. ఓ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవదహనవ్వడం కలకలం రేపుతోంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ముంబయిలోని చెంబూల్ అనే ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషాద ఘటనలో ఒకే కుటుంబంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మంటలు వ్యాపించిన సమయంలో ఆ కుటుంబ సభ్యులు నిద్రలో ఉన్నారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే తప్పించుకోలేకపోయారు. 

Also Read: మరో దారుణం.. అనుమానాస్పద స్థితిలో 10ఏళ్ల బాలిక మృతి

ఇంట్లో మంటలు రావడాన్ని చూసి చట్టుపక్కల వారు చూసి షాకైపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది సిబ్బంది మంటలు ఆర్పేశారు. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Also read: పెరగనున్న సిమెంట్ ధరలు.. బస్తాపై ఎంతంటే?

#maharashtra #telugu-news #national-news #mumbai #short-circuit
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe