/rtv/media/media_library/vi/WchIUJftjDc/hqdefault.jpg)
Sabarimala ayappa Makara jyoti
Makara jyothi: హిందువులు జరుపుకునే పెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ పవిత్రమైన రోజున.. అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఆ జ్యోతిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు వెళ్తుంటారు. ఆ పవిత్రమైన జ్యోతి దర్శనం అనేది అందరికీ కలిగే భాగ్యం కాదు. ఆ జ్యోతి దర్శనం కలగాలంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలంటారు. ఆ అపురూప దృశ్యం కోసం గంటల కొద్దీ లైన్లలో వేచి ఉంటారు. అయినప్పటికీ జ్యోతి దర్శనం అవుతుందా లేదా అనేది కూడా సందేహమే.
అయ్యప్పస్వామి జ్యోతి రూపంలో..
ఈ ఏడాది జనవరి 14న శబరిమలలో మకరజ్యోతి దర్శనం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 30 నుంచి ఈ సంవత్సరం జనవరి 20 వరకు ఈ మకరజ్యోతి యాత్ర జరుగుతుంది. అయితే జనవరి 14న అయ్యప్పస్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారని అందరిలో బలమైన నమ్మకం. శబరిమలకు వెళ్లిన ప్రతిఒక్కరూ ఆ జ్యోతి దర్శనాన్ని ప్రత్యక్షంగా చూస్తారు. ఆ సమయంలో స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాముల శరణుఘోషతో శబరిగిరులు మారుమోగుతుండగా సాక్షాత్తు మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు. శబరిమల నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నంబలమేడు వద్ద కొండపై మకర జ్యోతి కనిపిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు జ్యోతి దర్శనం జరుగుతుంది. ఈ జ్యోతి సూర్యాస్తమయం తర్వాత కొద్దిసేపటికే కనిపిస్తుంది. ఇది మూడుసార్లు కనిపిస్తుంది, ఆ తరువాత అదృశ్యమవుతుంది.
ఇది కూడా చదవండి: Google: నీ గూగుల్ సెర్చ్కు గత్తర రాను.. చావు తర్వాత ఏమిటని వెతికి..!
అయితే పురాణాల్లో ప్రతి దానికి ఒక చరిత్ర ఉంటుంది. అలాగే సంక్రాంతి రోజున దర్శనమిచ్చే మకర జ్యోతికి కూడా ఓ చరిత్ర ఉంది. రాజుగా ఉండాల్సిన అయ్యప్ప స్వామి.. రాజభవనం నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో రాజ్యమంతా కన్నీరుమున్నీరుగా విలపించడం మొదలయ్యింది. దీంతో అయ్యప్ప స్వామి తాను పట్టాభిషేకం విరమించుకున్నంత మాత్రాన ప్రజల సమస్యలను వినకుండా పోనని, శబరిమల కొండపై తాను నెలకొంటానని తెలిపారు. అలాగే సంక్రాంతి రోజున మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చి జనాల సమస్యలను విని, వాటిని పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం అయ్యప్ప స్వామి ప్రతి సంక్రాంతికి మకర జ్యోతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు.