Rajasthan Teacher : పరీక్ష ఆపించి విద్యార్థితో కోడ్ని కోయించాడు.. టీచర్ సస్పెండ్!

పరీక్ష రాస్తున్న ఓ స్టూడెంట్ ను మధ్యలోనే ఆపించిన ఓ టీచర్ అతనితో కోడిని కోయించి, స్కీన్ తీయించి, శుభ్రంగా కట్ చేయించి ఇంటికి పంపించాడు.  ఇది కాస్త గ్రామస్థులకు తెలియడంతో అతనిపై విద్యాశాఖ అధికారులుకు ఫిర్యాదు చేయడంతో ఆ టీచర్ ను సస్పెండ్ చేశారు.

New Update
kodi

kodi

పరీక్ష రాస్తున్న ఓ స్టూడెంట్ ను మధ్యలోనే ఆపించిన ఓ టీచర్ అతనితో కోడిని కోయించి, స్కీన్ తీయించి, శుభ్రంగా కట్ చేయించి ఇంటికి పంపించాడు.  ఇది కాస్త గ్రామస్థులకు తెలియడంతో అతనిపై విద్యాశాఖ అధికారులుకు ఫిర్యాదు చేయడంతో ఆ టీచర్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఉదయ్‌పూర్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేసిన  మోహన్‌లాల్ ..  తొమ్మిదో తరగతి విద్యార్థిని అయిన రాహుల్ కుమార్ పరీక్ష రాయడం మధ్యలో మానేయమని చెప్పి అతనితో కోడిని కోయించాడు. 

Also read : Pakistan Bomb Blast:  పాకిస్తాన్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఏడుగురు మృతి!

స్కీన్‌ తీసి ముక్కలుగా కట్‌ చేయించి

అంతేకాకుండా దాని స్కీన్‌ తీసి ముక్కలుగా కట్‌ చేయించాడు. ఆ తర్వాత వంట చేయమని కోడి మాంసాన్ని తన ఇంటికి పంపించాడు. ఆ గ్రామస్థులకు ఈ విషయం తెలియడంతో టీచర్ ప్రవర్తనపై వారు మండిపడ్డారు. ఇదే విషయంపై మంత్రి బాబులాల్ ఖరారీని కలిసిఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు.ఈ రిపోర్ట్‌ ఆధారంగా టీచర్ మోహన్‌లాల్‌ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్‌ చేశారు. కాగా మోహన్‌లాల్ నెల కిందట స్కూల్‌ కుక్‌ను తొలగించగా అప్పటి నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా  అందడం లేదు. అలాగే మోహన్‌లాల్‌ స్కూల్ విద్యార్థులతో వ్యక్తిగత పనులు చేయిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.    

Also read : Nandamuri Balakrishna పద్మ భూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య.. ఫొటోలు వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు