/rtv/media/media_files/2025/08/27/modi-refused-donald-trump-2025-08-27-11-38-23.jpg)
Trump Tariffs
Trump Tariffs:
అమెరికా(America), భారత్(India) మధ్య వాణిజ్య సంబంధాలు(Trade Relations) దిగజారుతున్నాయని జర్మన్ మీడియా పేర్కొంది. ట్రంప్ టారిఫ్స్ పెంపుపై భారత్ భయపడటం లేదని.. అమెరికాతో వాణిజ్య వివాదంపై ఇప్పటికే తీవ్ర ఆగ్రహంగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ట్రంప్(Donald Trump) యత్నించగా ఆయన స్పందించలేదని ఓ జర్మన్ మీడియా సంస్థ తెలిపింది. గత వారం రోజులుగా ట్రంప్.. మోదీకి 4 సార్లు కాల్ చేసినప్పటికీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని పేర్కొంది. 'ఫ్రాంక్ఫర్టర్ ఆల్గెమైన్ జైతుంగ్' అనే వార్తా సంస్థ ఈ సంచలన కథనాన్ని ప్రచురించింది.
German Magazine FAZ reports Trump tried calling Modi 4 times and no one picked up his call in New Delhi.
— Arun Pudur (@arunpudur) August 26, 2025
That’s not a snub. That’s maturity. Modi saw through the schemes: photo-ops with Munir, pushing GMOs, meat-fed dairy, dictating policy, Zero tariffs from US Products and more pic.twitter.com/4y5ZXNc64i
దీనికి కారణం భారత్పై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్లేనని ఆ పత్రిక పేర్కొంది. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకంతో పాటు, అదనంగా మరో 25 శాతం సుంకం విధించడంపై మోదీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయన ట్రంప్ కాల్స్ను పట్టించుకోవడం లేదని పేర్కొంది. మోదీ తన కోపాన్ని, ఆందోళనను తెలియజేయడానికే ట్రంప్తో ఫోన్లో మాట్లాడటానికి ఇష్టపడట్లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read:ఉద్యోగం కోసం ఇక అమెరికా పోలేరు.. భారతీయులకు ఊహించని షాక్ ఇచ్చిన ట్రంప్
Big Big Expose 🚨
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) August 26, 2025
Shocking Revelation from German Daily Reports
Trump tried to call Modi 4 times, however
Modi clearly refused to talk to Trump
Trump is chasing after Modi, Modi is ignoring
India has clearly said we will not bow, we will not bow pic.twitter.com/hmvLIk8Dsf
గతంలో ట్రంప్ ఇతర దేశాల అధినేతలతో ఫోన్లో మాట్లాడిన తర్వాత, ఆ సంభాషణల సారాంశాన్ని మార్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయని, ఆ ట్రాప్లో పడకుండా మోదీ జాగ్రత్త పడుతున్నారని జర్మన్ న్యూస్ పేపర్ రాసింది. జర్మన్ పత్రిక కథనాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, భారత ప్రభుత్వం తరఫున దౌత్యవేత్తలు అనధికారికంగా దీనిపై స్పందించినట్లు తెలుస్తోంది. ఇలాంటి సెన్సిటీవ్ మ్యాటర్లు మోదీ ఫోన్లో డీల్ చేయరని కొందరు అంచనా వేస్తున్నారు.