/rtv/media/media_files/2025/05/09/oCy1NVeWkVnZqcqJbUwQ.jpg)
PM Modi High-Level Meet
PM Modi High-Level Meet: మే 8 (గురువారం) రాత్రి, భారత్(India) చేపట్టిన "ఆపరేషన్ సిందూర్"కి(Operation Sindoor) కౌంటర్ గా పాకిస్థాన్(Pakistan) కుట్రాత్మకంగా దాడికి యత్నించింది. భారతదేశంలోని పలు ముఖ్య ప్రాంతాలు, సైనిక స్థావరాలు, ఎయిర్పోర్టులు, అలాగే ప్రార్థనా మందిరాలు లక్ష్యంగా చేసుకుని మిసైళ్లతో పాటు డ్రోన్లను ఉపయోగించి దాడులకు పాల్పడింది.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్పై ఖర్గే సంచలన కామెంట్స్!
పాక్ దాడులను భారత సైన్యం ముందుగానే గుర్తించి అన్ని ప్రాంతాల్లో పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. కౌంటర్ దాడిలో భాగంగా పాక్ లోని కొన్ని కీలక ప్రాంతాలపై డ్రోన్ల సహాయంతో ఎదురుదాడి చేసింది.
Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
ఈ పరస్పర దాడుల వల్ల, మే 8 (గురువారం) రాత్రి భారత- పాక్ సరిహద్దుల్లో తీవ్రమైన ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యుద్దానికి సంబంధించిన పేలుళ్ల వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
నరేంద్ర మోడీ సమీక్ష..
ఈ నేపథ్యంలో భారతదేశ సరిహద్దుల్లో తలెత్తిన ఈ తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష జరిపారు. దేశ భద్రతను సమర్థవంతంగా నిర్వహించేందుకు కీలకమైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమావేశమై, పరిస్థితులపై పూర్తి వివరాలను పరిశీలించారు.
Also Read: Pakistan: ''మా ప్రధాని పిరికివాడు''.. పాకిస్థాన్ ఎంపీ ఫైర్
అయితే, ప్రధానమంత్రి రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఫోన్ ద్వారా మాట్లాడి, ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
ఇక గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమై, ప్రజా భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి సభలలో అయినా లేదా ఉత్సవాల్లో అయినా బాణసంచా పేలుళ్లు, డ్రోన్ల వినియోగంపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ప్రజల్లో భయాందోళనలు నివారించేందుకు, భద్రతా వ్యవస్థలను పటిష్ఠంగా కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Pakistan: ''మా ప్రధాని పిరికివాడు''.. పాకిస్థాన్ ఎంపీ ఫైర్
దేశ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.