/rtv/media/media_files/2025/05/12/0U69Kz3Vm7tHYMqEDqi3.jpg)
అప్పు తెచ్చుకున్న ఆయుధాలతో పాకిస్తాన్ భారత్పైకి యుద్ధానికి కాలు దువ్వింది. భారత్పై పాకిస్తాన్ జరిపిన దాడులను ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ తిప్పికొట్టింది. ఇండియన్ ఆర్మీ వాటిని పరిశీలించి అవి చైనా, టర్కీకి చెందినవిగా గుర్తించారు. చైనా PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి శిథిలాలను ఆర్మీ సాక్ష్యాలతో మీడియా ముందు పెట్టింది. టర్కికి చెందిన YIHA, సోంగర్ డ్రోన్లు కూడా ఇండియాపైకి దాడికి ప్రయత్నించాయని తేలింది. వాటికి సంబంధించిన శిథిలాలు ఫొటోలతో సహా మీడియాకు చూపించారు.
#WATCH | Delhi | The Indian military shows the debris of a likely PL-15 air-to-air missile, which is of Chinese origin and was used by Pakistan during the attack on India.
— ANI (@ANI) May 12, 2025
The wreckage of the Turkish-origin YIHA and Songar drones that were shot down by India has also been shown pic.twitter.com/kWIaIqnfkQ
న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో శిథిలాలను ఉంచారు. ఆపరేషన్ సిందూర్కు పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలని 15 నగరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. ఈ దాడుల్లో చైనా మిస్సైల్స్, టర్కీ డ్రోన్లు వాడింది. త్రివిధ దళాధిపతులు సోమవారం మీడియా సమావేశం పెట్టారు. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ కీలక విజయాలను వివరించారు.
(Turkish drones | china | india pak war)