/rtv/media/media_files/2025/04/23/UeXJnevec1ffyouW6BXo.jpg)
Pahalgam Attack
జమ్మూకశ్మీర్ పహల్గాంలో జరిగన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల కాల్పుల్లో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. వీళ్లలో లెఫ్టినెంట్ వినయర్ నర్వాల్ (26) అనే నేవీ అధికారి పెళ్లయిన ఆరురోజులకే ఉగ్రవాదుల చేతిలో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేని ఆ నవవధువు ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాకు చెందిన వినయ్ నర్వాల్.. ప్రస్తుతం కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు.
Also Read: నలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు
ఏప్రిల్ 16న ఆయనకు వివాహం జరిగింది. హనీమూన్ కోసం ఆయన తన సతీమణితో కశ్మీర్కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే వినయ్ జీవితం ఉగ్రవాదులకు బలైపోయింది. భర్తను కోల్పోయిన ఆ నవవధువ ఆవేదన అందరినీ కన్నీ్ళ్లు పెట్టిస్తోంది. ఆమె రోదిస్తూ.. '' మాకు పెళ్లయి ఆరు రోజులే అయ్యింది. ఈ ఘటన జరిగినప్పడు మేము పానీపూరీ తింటున్నాం. ఒక్కసారిగా ఓ ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగాడు. వెంటనే తన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని'' ఆమె ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
🚨Vinay Narwal, a 26-year-old Indian Navy officer from #Karnal, #Haryana
— Haryana Development Index (@InfrageoHaryana) April 23, 2025
📅 16 April – Lieutenant Vinay got married.
📅 19 April – The couple traveled to Kashmir for the their honeymoon
📅 22 April – Lieutenant Vinay was tragically killed in a terrorist attack in #Pahalgam https://t.co/n8ElIenhaE pic.twitter.com/6w0qprTnm8
A Kashmiri Muslim man helped all those people who were injured in the attack and took them to the hospital.
— Md. Arman (@MdArmanINC) April 22, 2025
While helping, he did not ask anyone's name and religion.
This is Kashmiriyat, this is Islam!#PahalgamTerrorAttack #Pahalgam #TerroristAttack #Kashmir #PahalgamAttack pic.twitter.com/jJRGXpDS7u
Also Read: పహల్గామ్ ఉగ్రదాడి.. ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా!
ఇదిలాఉండగా మినీ స్విట్జర్లాండ్గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.
Also Read: పహల్గామ్ అటాక్ సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్!
telugu | Pahalgam attack