BIG BREAKING: పాకిస్తాన్ సరిహద్దులో ఈసారి ఆపరేషన్ షీల్డ్ (VIDEO)

పాకిస్తాన్ బార్డర్‌లో 4రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో మాక్ డ్రిల్‌ నిర్వహించారు. మే 29న జరగాల్సింది కొన్ని కారణాల వల్ల ఈరోజు చేశారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్‌లో మాక్ డ్రిల్‌లలో జరిగాయి.

New Update
Mock drill being

శత్రుదేశం పాక్‌తో సరిహద్దు పంచుకునే 4రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో శనివారం ఆపరేషన్ షీల్డ్ పేరుతో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌ నిర్వహించారు. పాకిస్తాన్‌తో భారత్‌కు కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ సివిల్ మాక్‌డ్రిల్ రెండవ సారి చేశారు అధికారులు. యుద్ధం వస్తే పౌరులు తమను తాము ఎలా కాపాడుకోవాలో ఇందులో శిక్షణ ఇస్తారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో మాక్ డ్రిల్‌ ట్రైనింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా అమృత్సర్, జైపూర్, పూంచ్ సహా వివిధ నగరాల్లో కూడా బ్లాక్‌అవుట్ కూడా అమలు చేశారు. అత్యవసర పరిస్థితులు, శ్రతు సైన్యాలు డాడి చేసినప్పుడు ఎలా ప్రతిస్పందించాలో రక్షణ, హాం శాఖ అధికారులు, NDRS బృందాలు పౌరులకు ట్రైనింగ్ ఇచ్చాయి.

గతంలో దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్‌డ్రిల్‌కు ఒక్క రోజు ముందే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మాక్‌డ్రిల్ మొదట మే 29న జరగాల్సి ఉంది. కానీ పరిపాలనా కారణాలతో వాయిదా పడింది. జాతీయ భద్రత దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మే 31న ఈ ఎక్స్‌ర్‌సైజ్ జరిపింది.

Operational Shield | civil defence mock drill | civil defence mock drill training | india mock drill | jammu kashmir terror attack | pakistan | india | india pak war | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు