Crime: రూ.10 కోసం తండ్రిని నరికిన కొడుకు.. తలతో పోలీస్ స్టేషన్‌లో సరెండర్

ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి రూ.10 కోసం సొంత తండ్రినే నరికి చంపేశాడు. ఆ తర్వాత తండ్రి తల తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

New Update
Odisha Man Kills Father For Rs 10, Surrenders To Police With Severed Head

Odisha Man Kills Father For Rs 10, Surrenders To Police With Severed Head


ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి రూ.10 కోసం సొంత తండ్రినే నరికి చంపేశాడు. ఆ తర్వాత తండ్రి తల తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని భైదార్‌ సింగ్‌(70) అనే వ్యక్తి తన కుటుంబంతో ఉంటున్నాడు. అయితే అతడి కొడుకు (40) గుట్కా కొనుక్కోనేందుకు రూ.10 డబ్బులు అడిగాడు. కానీ భైదార్ సింగ్‌ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. 

Also Read: అసెంబ్లీలో గుట్కా నమిలి ఉమ్మిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్

దీంతో అతడి కొడుకు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పదునైన ఆయుధంతో తన తండ్రిని హత్య చేశాడు. దీంతో భయంతో అతడి తల్లి అక్కడి నుంచి పారిపోయింది. ఆ తర్వాత నిందితుడు తన తండ్రి తలను తీసుకొని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. డబ్బుల విషయంలో తండ్రి, కొడుకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఈ దారుణం జరిగినట్లు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి ఫోరెన్సిక్ బృందం వెళ్లిందని.. ఈ కేసుపై విచారణ సాగుతోందని పేర్కొన్నారు. 

Also Read: ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికిన హీరోయిన్..ఆ పనిచేస్తూ పోలీసులకు..

Also Read: ఆసీస్‌పై అదిరే విక్టరీ.. ఫైనల్‌కు భారత్!

Advertisment
తాజా కథనాలు