/rtv/media/media_files/2025/06/12/KCe6RyiR9IdzVB17eKhi.jpg)
Plane Crash
Plane crash : ఆహ్మదాబాద్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల బాధ వర్ణణాతీతం. అయితే ఆ ఫ్లైట్కు వెళ్లాల్సి ఉండి వెళ్లలేకపోయినవారు మాత్రం నిజంగా అదృష్టవంతులే అని చెప్పాలి. ఫ్లైట్ మిస్సయింది బాధపడుతున్న వారికి ఈ ప్రమాదం నుంచి బయటపడ్డామన్న సంతోషం ఓ వైపు, ఆ ప్రమాదంలో తాముంటే పరిస్థితి ఏంటని తలుచుకుంటూ తమను తాము తడిమి చూసుకుంటున్నారు.
Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !
ఆలస్యం అమృతం విషం అంటారు కదా! అచ్చు అలాంటిదే భూమి చౌహన్ పరిస్థితి. ఆలస్యం ఆమెను ఈ రోజు ప్రాణాలతో నిలిపింది. ఆమె అదృష్ఠవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో ఆమె ఎయిర్పోర్టుకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు.దీంతో ఫ్లైట్ మిస్ అయింది. ఆ పది నిమిషాల్లోనే ప్రమాదం జరిగింది. దీన్ని తలచుకుంటూ తనను గణపతి దేవుడే రక్షించాడని ఆమె అన్నారు. వెకేషన్ కోసం తాను వచ్చానని ఈ ఘటన తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని భూమి వాపోయింది.
Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్పై కీలక నిర్ణయం!