/rtv/media/media_files/2025/01/17/HwY8ypdFmdxeehVbIF4O.jpg)
obama and michelle
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తాజాగా మిషెల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. వాళ్లిద్దరీ మధ్య వైవాహిక జీవితంపై నిరాధార ఆరోపణలు చేయొద్దని కోరింది. ఒబామా దంపతులు విడాకులు తీసుకోనున్నారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అలాగే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఒబామా హజరవుతారని చెప్పింది.
Also Read: సైఫ్పై దాడి వెనుక అండర్వరల్డ్ హస్తం ? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
గతంలో ట్రంప్ ఒబామా కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, జాతి ఆధారంగా చేసిన విమర్శల వల్లే మిషెల్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారని తెలిపింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మిషెల్ సీరియస్గా తీసుకున్నారని.. ఆయన్ని ఆమె ఎప్పటికీ క్షమించనని చెప్పినట్లు పేర్కొంది. కొన్నిరోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలు జరిగినప్పుడు ఆమె వేరే చోట ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపింది.
Also Read: ఘోర ప్రమాదం.. 40మంది పాకిస్థానీ వలసదారులను మింగేసిన సముద్రం.. ఎక్కడంటే?
ఇదిలాఉండగా.. గత కొంతకాలంగా ఒబమా, మిషల్ దంపతులు వివిధ కార్యక్రమాలకు విడివిడిగా హాజరవుతున్నారు. దీంతో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు ఊహగానాలు వచ్చాయి. అయితే ఇటీవలే జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు కూడా మిషెల్ హాజరుకాలేదు. అలాగే ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆమె దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒబామా దంపతులకు విడాకులు తీసకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మిషెల్ టీమ్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.
Also Read: ఏపీకి గుడ్న్యూస్.. వైజాగ్ స్టీల్ప్లాంట్కు కేంద్రం రూ.11,440 ప్యాకెజీ
Also Read: బాబా సజీవ సమాధి తవ్వకుండా అడ్డుకున్న ఫ్యామిలీ.. పోలీసుల విచారణలో బిగ్ ట్విస్ట్