VIRAL VIDEO: నువ్వా నేనా.. జుట్లు పట్టుకుని పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తా కోడళ్లు (వీడియో)!

మహారాష్ట్రలోని నాసిక్‌లో విచిత్ర సంఘటన జరిగింది. కోర్టు ముందు అత్తా కోడళ్లు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని చితకబాదుకున్నారు. గొడవ తీవ్రంగా మారడంతో ఇరు కుటుంబ సభ్యులు తమవంతుగా కొట్టుకున్నారు. చివరికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి గొడవను ఆపారు.

New Update
Maharashtra Nashik Mother In Law, Daughter-In-Law, And Relatives Clash Outside Court

Maharashtra Nashik Mother In Law, Daughter-In-Law, And Relatives Clash Outside Court

VIRAL VIDEO: శాంతం అనేది మనుషుల్లో రోజు రోజుకూ క్షీణిస్తోంది. చిన్న చిన్న విషయాలకే గొడవలకు దిగుతున్నారు. ఓర్పు, శాంతం అనేవి అసలు లేనట్లు ప్రవర్తిస్తున్నారు. ఆస్తుల కోసం, ఇతర విషయంలోనూ తేడా వస్తే అస్సలు తగ్గడం లేదు. శాల్తీలు లేపేస్తున్నారు.

 తన, మన భేదం లేకుండా సహనం కోల్పోతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సాధారణంగా అత్తా కోడళ్ల మధ్య వివాదాలు సర్వ సాధారణం. కానీ వారి మధ్య గొడవ తీవ్రంగా మారితే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అందరికీ అర్థం అవుతుంది. 

Also Read: Satya Nadella: ఇంటర్వ్యూ కోసం ఏకంగా సత్య నాదెళ్లకే మెయిల్‌..ఎంత సేపటిలో రిప్లై వచ్చిందో తెలుసా!

అత్తా కోడళ్ల వివాదం

మహారాష్ట్రలోని నాసిక్‌లో జిల్లా & సెషన్స్ కోర్టుకి అత్తా కోడళ్లు ఓ వివాదం పరిష్కారం కోసం వెళ్లారు. అయితే కోర్టు లోపలికి వెళ్లకముందే అత్త యమునా యశ్వంత్ నికం అలాగే కోడలు సోదరుడు దీపక్ హిరామన్ సాల్వే మధ్య మాటల యుద్ధం జరిగింది. అది కాస్త తీవ్రంగా మారింది. దీంతో అత్తా కోడళ్లు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. 

Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మహిళల వీడియోలు షేర్ ..  15 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు బుక్  !

ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో అత్త తరపు కుటుంబ సభ్యులు, కోడలి తరపు కుటుంబ సభ్యులు కలిసి తమ వంతుగా చితకబాదుకున్నారు. ఎవరు ఎవర్ని కొడుతున్నారో వారికే అర్థం కానట్లు ప్రవర్తించారు. అందులో ఓ వ్యక్తి మహిళ వీపుపై తన్నడం క్లియర్‌గా కనిపిస్తుంది. అయితే ఇంత జరుగుతున్నా పక్కనే ఉన్న కొంతమంది  మహిళా పోలీసు అధికారులు, న్యాయవాదులు జోక్యం చేసుకోకుండా.. ప్రేక్షకులుగా మాత్రమే చూడటం గమనార్హం. చివరికి సర్కార్వాడ పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ నాన్-ప్రాసిక్యూషన్ కేసు నమోదు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు