/rtv/media/media_files/2025/01/28/XIQtBYdbZGTGfrecCFeM.jpg)
kolipura Photograph: (kolipura)
ప్రపంచమంతా 5జీ టెక్నాలజీలో పోటీ పడుతుంటే ఆ ఊళ్లో మాత్రం సెల్ఫోన్ సిగ్నల్లే రావట్లే. దేశానికి స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఆ గ్రామంలో కరెంటు సదుపాయం లేదు. మరొక వింత ఏంటంటే..ఆ గ్రామంలోని అబ్బాయిలు పెళ్లే చేసుకోరు. కరెంటు, ఫోన్, భార్యా పిల్లలు ఇవేవి లేకుండా ఎందుకు గడుపుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు. ఫ్యాన్, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ఇలాంటి వస్తువులు మన జీవతంలో లేకుంటే.. ఏం చేసేవాళ్లం. అన్నింటికంటే ఎక్కువ మొబైల్ ఫోన్. కరెంట్, ఇంటర్నెట్ ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రపంచమే మీ చేతిలో ఉన్నట్లే. అలాంటిది ఆ గ్రామంలో రెండు సదుపాయాలు లేవు.
Also Read: తల్లికి అక్రమ సంబంధం.. తండ్రి ఎవరో తెలుసుకోవడానికి కోర్టుకెక్కిన కొడుకు
ఈ ఊరు ఇండియాలోనే ఉన్నా.. ఆ గ్రామ ప్రజలు మాత్రం ప్రపంచానికి దూరంగా ఉన్నారు. రాజస్థాన్ లాంటి ఎడారి రాష్ట్రంలో కరెంట్, ఇంటర్నెట్ లేకుండానే గడిపేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. దీంతో ఆగ్రామంలో యువకులకు పెళ్లిలు కూడా కావడం లేదు. ఏ సదుపాయాలు లేని గ్రామానికి ఆడపిల్లని ఎలా ఇస్తామని అమ్మాయిల తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. ఆ గ్రామానికి కరెంట్, మొబైల్ సిగ్నల్ ఎందుకు రావట్లేదంటే..
Also Read:Delhi Burari: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకుని!
రాజస్థాన్లోని కోటా ప్రాంతానికి చెందని కొలిపురా గ్రామం ముకుంద్రా టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. దీంతో అటవీ శాఖ కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులకు అనుమతించడం లేదు. ఈ కారణంగా గ్రామస్థులు తమ ఇష్టానుసారంగా మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ గ్రామానికి కరెంటు రాలేదు, మొబైల్ నెట్వర్క్ కూడా లేదు. పులుల పునరావాసం కోసం గ్రామం ఉద్దేశించడం వల్ల ఇక్కడి ప్రజలు ఇళ్లను నిర్మించలేరు. ముకుంద్రా టైగర్ రిజర్వ్లో ఉన్న కొలిపురా గ్రామంలో 500 కుటుంబాలకు పైనే నివసిస్తున్నారు.