/rtv/media/media_files/2025/04/24/ELt3iWB1GuVww4SYVtQc.jpg)
Kerala Man, Stranded In Bahrain Since 1983, Finally Returns Home
భారత్లో చాలామంది బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. చేసిన అప్పులు తీర్చేందుకు, కుటుంబ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఆయా దేశాలకు వెళ్లి పనులు చేస్తుంటారు. అయితే కొంతమంది కొన్ని కారణాల వల్ల అక్కడ చిక్కుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలానే ఉద్యోగం కోసం బహ్రెయిన్కు వెళ్లిన ఓ వ్యక్తి.. తన పాస్పోర్టు పోగొట్టుకొని ఏకంగా 42 ఏళ్ల పాటు అక్కడే ఉండిపోయాడు. తాజాగా ఇండియకు తిరిగివచ్చారు.
Also Read: ఉగ్రవాదులను భూమిలోకి తొక్కేస్తాం.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని తిరువనంతపూర్ జిల్లా పౌడికోణం సమీపంలోని ఓ చిన్న గ్రామంలో గోపాలన్ చంద్రన్ ఉండేవారు. అయితే ఈయన ఉద్యోగం కోసం 1983లో బహ్రెయిన్కు వెళ్లారు. అక్కడికి వెళ్లాక కొంతకాలానికి తన యజమాని మృతి చెందాడు. మరోవైపు గోపాలన్ కూడా తన పాస్పోర్టును పోగొట్టుకున్నారు. దీంతో ఆయన బహ్రెయిన్లోనే చిక్కుకుపోయారు. స్వదేశానికి తిరిగి వచ్చే మార్గం అతనికి తెలియలేదు.
Also Read: క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాకిస్థాన్.. భారత్-పాకిస్థాన్ యుద్ధం జరగనుందా ?
దీనివల్ల ఏకంగా దాదాపు 42 ఏళ్ల పాటు గోపాల్ ఆ దేశంలోనే ఉండిపోయారు. అయితే ఇటీవల ఫేస్బుక్లో గోపాలన్ తనకు జరిగిన సంఘటన గురించి చెబుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని చూడాలని ఉందంటూ వాపోయారు. చివరికీ ఈ వీడియో ప్రవాసీ లీగల్ సెల్ ఎన్జీవో దృష్టికి చేరింది. ఈ క్రమంలో గోపాలన్ను వెనక్కి తీసుకొచ్చేందుకు బహ్రెయిన్లో భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపారు. వారి సాయంతో ఎట్టకేలకు భారత్కు చేరుకున్నారు.
Also Read: జమ్మూకాశ్మీర్లో భారీ నిరసనలు.. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న ప్రజలు
telugu-news | rtv-news | national-news | gulf