Kedarnath Helicopter Crash: కేదార్‌నాథ్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి మరో వీడియో

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన కొత్త వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో NDRF సభ్యులు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు కనిపిస్తున్నారు. ప్రమాద స్థలంలో హెలికాప్టర్ ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

New Update
Kedarnath Helicopter Crash video gaurikund uttarakhand chardham yatra

Kedarnath Helicopter Crash video gaurikund uttarakhand chardham yatra

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఇవాళ ఉదయం హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన కొత్త వీడియో మరొకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో.. ప్రమాద స్థలం నుండి పొగలు పైకి లేచినట్లు కనిపిస్తోంది. హెలికాప్టర్ ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అలాగే అందులో NDRF సభ్యులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తున్నారు. గౌరికుండ్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న 7 మంది మరణించారు. 

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

Kedarnath Helicopter Crash video

ఈ హెలికాప్టర్ ఆర్యన్ కంపెనీకి చెందినది. ఇది చార్‌ధామ్ యాత్రకు హెలికాప్టర్ సేవలను అందిస్తుంది. కేదార్‌నాథ్ హెలిప్యాడ్ నుండి ఉదయం 5:17 గంటలకు గుప్త్కాషికి బయలుదేరింది. గుప్త్కాషి వైపు వస్తున్న లోయ పాయింట్ వద్ద ఉదయం 5:24 గంటలకు కూలిపోయింది. దీంతో స్థానికంగా ఉండే నేపాలీ సంతతికి చెందిన మహిళలు హెలికాప్టర్ పడిపోవడాన్ని చూసి హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించారు. 

Also read: మణిపూర్‌ వెపన్స్‌ ఆఫరేషన్‌..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం

అందిన సమాచారం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన జైస్వాల్ కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో మరణించారు. మృతులు పైలట్ కెప్టెన్ రాజ్‌వీర్, విక్రమ్ రావత్, వినోద్, త్రిష్టి సింగ్, రాజ్‌కుమార్ జైస్వాల్, శ్రద్ధా జైస్వాల్, 10 ఏళ్ల రాశి జైస్వాల్‌గా గుర్తించారు. ఇక కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ ప్రమాదం తర్వాత చార్ ధామ్ యాత్ర కోసం హెలికాప్టర్ సర్వీస్‌ను నిలిపివేశారు. 

Also read: ప్రతిరోజూ ఒక గ్లాసు బెల్లం పాలు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది?

ఈ ప్రమాదంపై దర్యాప్తును డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు అప్పగించింది. ఈ మేరకు ఒక ట్వీట్‌ చేశారు. ఆర్యన్ ఏవియేషన్ బెల్ 407 హెలికాప్టర్ VT-BKA కూలిపోయిందని తెలిపారు. చార్‌ధామ్ యాత్ర కోసం DGCA ఇప్పటికే హెలికాప్టర్ సేవల సంఖ్యను తగ్గించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు