/rtv/media/media_files/2025/02/22/FDyoOyAKqdMEpsCuIWBL.jpg)
Indian Railways New General Ticket Rules Set to Affect Crores of Passengers Photograph: (Indian Railways New General Ticket Rules Set to Affect Crores of Passengers)
భారతీయ రైల్వే టికెట్ నిబంధనలు మార్చింది. మే1 నుంచి రైల్వే టికెట్ నిబంధనలను కఠినతరం చేయబోతున్నది. వెయిటింగ్ టికెట్లు ఉన్న ప్రయాణికులకు స్లీపర్ దక్కకుటే ఏసీ కోచ్లలో ప్రయాణించేందుకు ఇకపై అనుమతి ఉండదు. వెయిటింగ్ టికెట్ ఉంటే.. ప్రయాణికుడు జనరల్ కోచ్లలో మాత్రమే ప్రయాణించవచ్చు. మే ఒకటి నుంచి కఠిన నిబంధనలు అమలు చేసిన తర్వాత.. ప్రయాణికులకు వెయిటింగ్ టికెట్లతో స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణించడంపై నిషేధం అమలులో ఉంటుంది. టికెట్ కన్ఫర్మ్ కాని ప్రయాణికులు స్లీపర్, ఏసీ కోచ్లలో వెయిటింగ్ టికెట్తో కనిపిస్తే టీటీఈ జరిమానా విధించే అవకాశం ఉంది. లేకపోతే జనరల్ కోచ్కు పంపించవచ్చు.
Also read: Pahalgam terror attack: ఉగ్రదాడిపై కొత్త అనుమానం రేపిన UP సీఎం యోగి
కన్ఫర్మ్ టికెట్లతో ప్రయాణించే ప్యాసింజర్ల సౌకర్యం కోసం మాత్రమే ఈ రూల్ని రూపొందించినట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కెప్టెన్ శశికిరణ్ పేర్కొన్నారు. టికెట్లు కన్ఫర్మ్ అయిన ప్రయాణికులు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్యాసింజర్ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా వెయిటింగ్ టికెట్లుతో స్లీపర్, ఏసీ కోచ్లలోకి వెళ్లి కన్ఫర్మ్ టికెట్స్ ఉన్న ప్రయాణికుల బెర్తుల్లో కూర్చునేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని రైల్వేశాఖ పేర్కొంది.
BREAKING: Railways all set to allow ONLY Confirmed Ticket Holders on Platforms.
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) March 8, 2025
~ No more overbooked trains! Ticket sales capped at Capacity & permanent Waiting Rooms coming to 60 major stations.
Convenience over Crowd is the message 👏🏼🇮🇳 pic.twitter.com/fSuq8WG329
స్లీపర్, ఏసీ కోచ్లలో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు పెరిగితే రైలు రాకపోకలకు సైతం ఇబ్బంది అవుతుందని చెప్పింది. స్లీపర్ కోచ్లో వెయిటింగ్ టికెట్తో ప్రయాణిస్తూ టీటీఈకి పట్టుబడితే అతనికి రూ.250 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. దాంతో పాటు స్లీపర్ క్లాస్ టికెట్ ఛార్జీ మొత్తం వసూలు చేస్తారు. దూరాన్ని బట్టి అదనంగా చార్జీ సైతం చెల్లించాల్సి రావొచ్చు.
Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!
థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్లలో వెయిటింగ్ టికెట్తో ప్రయాణిస్తే ఇంకా ఎక్కువ ఫైన్ చెల్లించాలి. సదరు ప్రయాణికుడికి రూ.440 జరిమానాతోపాటు జనరల్ కోచ్కు పంపిస్తారు. తర్వాత వచ్చే రైల్వేస్టేషన్లో దింపివేసే హక్కు టీటీఈకి ఉంటుంది. టికెట్ లేకుండా ప్రయాణించినిస్తే గరిష్టంగా రూ.1000 జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.
(indian-railway | indian-railway-news | passengers new-rules)