Karachi Port: కరాచీ పోర్టును లేపేస్తాం !.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

పాకిస్థాన్‌కు ఇండియన్ నేవీ పవర్‌ఫుల్‌ వార్నింగ్‌ ఇచ్చింది. పాకిస్థాన్‌లోని కరాచీ పోర్టును టార్గెట్‌ చేసేందుకు కూడా సిద్ధమేనని తెలిపింది. ఆదివారం ఆపరేషన్ సింధూర్‌పై జరిగిన మీడియా సమావేశంలో ఇండియన్ నేనీ ఈ ప్రకటన చేసింది.

New Update

పాకిస్థాన్‌కు ఇండియన్ నేవీ పవర్‌ఫుల్‌ వార్నింగ్‌ ఇచ్చింది. పాకిస్థాన్‌లోని కరాచీ పోర్టును టార్గెట్‌ చేసేందుకు కూడా సిద్ధమేనని తెలిపింది. ఆదివారం ఆపరేషన్ సింధూర్‌పై జరిగిన మీడియా సమావేశంలో ఇండియన్ నేనీ ఈ ప్రకటన చేసింది. '' పహల్గాం దాడి జరిగిన అనంతరం మేము రంగంలోకి దిగాం. డిఫెన్స్‌ ఫోర్సెస్‌తో కలిసి జాయింట్‌ ఆపరేషన్‌కు సిద్ధమయ్యాం. 96 గంటల్లోనే అరేబియన్ సముద్రంలో అన్ని రకాల పరీక్షలు చేశాం. కరాచీ పోర్టును టార్గెట్‌ చేసేందుకు కూడా మేము సిద్ధమే. పాకిస్థాన్ నేవీ డిఫెన్సివ్ మోడ్‌లో ఉంది. పాకిస్థాన్‌ నేవీ కదలికలపై కూడా నిఘా పెట్టామని'' ఇండియన్ నేవీ ప్రకటించింది.

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

పాకిస్తాన్ కాల్పుల విరమణను మరోసారి ఉల్లంఘిస్తే, తాము మరింత గట్టి సమాధానం ఇస్తామని డిజిఎంఓ  లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్‌ ఘాయ్‌ హెచ్చరించారు. తనకు నిన్న మధ్యాహ్నం 3:35 గంటల సమయంలో పాకిస్తాన్ డిజిఎంఓతో కాల్ సంబాషణ జరిగిందని, ఆయన ప్రతిపాదన మేరకు 2025 మే 10న సాయంత్రం 5:00 గంటల నుండి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఆగిపోయిందని అన్నారు. ఈ ఒప్పందాన్ని మరింత బలోపేతం చేయడానికి, దీర్ఘకాలికంగా మార్చడానికి మార్గాలను చర్చించడానికి మే 12, 2025న మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ మాట్లాడాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. 

national-news | telugu-news | karachi  india-pakistan

Advertisment
Advertisment
తాజా కథనాలు