/rtv/media/media_files/2025/07/17/nimisha-priya-2025-07-17-18-29-31.jpeg)
యెమెన్లో ఉరిశిక్ష పడిన నిమిష ప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నిమిష ప్రియకు భారత ప్రభుత్వం అండగా నిలిచింది. ఉరిశిక్ష రద్దు కోసం మోదీ సర్కారు రంగంలోకి దిగింది. నిమిషకు భారత్ తరపున అన్నివిధాల సాయం అందిస్తున్నామని విదేశాంగశాఖ తెలిపింది.
కేంద్రం యెమెన్లో నిమిష తరుపున వాదించేందుకు లాయర్ నియమించింది. ఇండియా నుంచి సంప్రదింపుల కోసం ఓ టీం యెమెన్ బయల్దేరింది. స్థానిక అధికారులు, బాధిత కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లడనున్నారు. ఎప్పటికప్పడు యెమెన్ అధికారులతో టచ్లో ఉన్నామని విదేశాంగశాఖ తెలిపింది. ఉరితీయబోయే కొన్ని గంటల ముందు మరణశిక్ష అమలును తాత్కాలికంగా వాయిదావేసింది యెమెన్ కోర్టు.