Operations Sindoor: 15 నిమిషాలు పవర్ ఇవ్వండి.. పాక్ ను నాశనం చేస్తాం.. MIM సంచలన ప్రకటన!

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఢిల్లీ MIM నేత షోయబ్ జమాయ్ సంచలన ప్రకటన చేశారు. భారత ముస్లింలకు 15 నిమిషాలు పవర్ ఇస్తే పాకిస్తాన్‌ను నాశనం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తమకు అధికారం అప్పగిస్తే పాక్‌ను ఎలా నాశనం చేయాలో తాము చెబుతామన్నారు. 

New Update
pak mim

Delhi MIM leader Shoaib Jamai sensational statement on Operations Sindoor

Operations Sindoor: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో MIM ఢిల్లీ నేత షోయబ్ జమాయ్ సంచలన ప్రకటన చేశారు. భారత ముస్లింలకు 15 నిమిషాలు పవర్ ఇస్తే పాకిస్తాన్‌ను నాశనం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తమకు అధికారం అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. పాక్‌ను ఎలా నాశనం చేయాలో తాము చెబుతామన్నారు. 

15 నిమిషాలు చాలు..

పాకిస్తాన్‌పై భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'పై భారీ మద్దతు పెరుగుతోంది. ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం సహించదనే బలమైన సందేశాన్ని ఇచ్చింది. దీంతో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటూ ప్రపంచవ్యాప్తంగా సపోర్టు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ AIMIM రాష్ట్ర అధ్యక్షుడు షోయబ్ జమాయ్ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. 'భారతదేశంలోని ముస్లింలకు 15 నిమిషాలు పవర్ ఇస్తే.. పాకిస్తాన్‌ను ఎలా నాశనం చేయవచ్చో మేము చూపిస్తాం' అని ఆయన కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ సిద్ధాంతం తిరస్కరించాం..

భారతదేశంలోని ముస్లింలు ఇప్పటికే 'ద్విజాతి సిద్ధాంతాన్ని' తిరస్కరించారని షోయబ్ జమాయ్ అన్నారు. 'మేము ఇరుదేశాల అహింస సిద్ధాంతాన్ని తిరస్కరించడమే కాకుండా.. దేశాల నిర్మాణం, పురోగతిలో బలమైన పాత్ర పోషించాం. దీనిని ఎప్పటికీ మరచిపోలేం' అన్నారు. ఈ సందర్భంగా భారత సైన్యంపై ప్రశంసలు కురిపించారు. 

Also Read :  ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయం.. ఈ వారం బెస్ట్ మూవీ సజెషన్ ఇదే!

మరోవైపు MIM అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఆపరేషన్‌ సింధూర్‌పై ప్రశంసలు కురిపించారు. 'పాకిస్తాన్ ఓడిపోవాలి. భారతదేశం వర్థిల్లాలి' అనే నినాదాలతో తన దేశభక్తిని ప్రదర్శించారు. జాతీయ భద్రత విషయంలో రాజకీయాలు ఉండకూడదని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి భారతీయుడు ప్రభుత్వం, సైన్యంతో నిలబడాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఆ దేశానికి మాటలతో చెప్పే సమయం లేదని, శిక్షించే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. అక్కడి నుండి వస్తున్న ఉగ్రవాదులు అమాయక భారతీయుల ప్రాణాలను బలిగొంటున్నారని, ఉగ్రవాదాన్ని తొక్కాల్సిన టైం వచ్చిందని అసదుద్దీన్ అన్నారు. 

delhi | operation sindoor india | today telugu news

Advertisment
Advertisment
తాజా కథనాలు