Balck Out: భారత సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్

జమ్మూ, కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో భారత, పాక్ ఆర్మీ దళాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. దీంతో  జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలు, పంజాబ్‌లోని చండీగఢ్, ఫిరోజ్‌పూర్, మొహాలి , గురుదాస్‌పూర్..రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా బ్లాక్‌అవుట్ లో ఉన్నాయి.

New Update

రాత్రంతా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. భారత, పాకిస్తాన్ ల మధ్య ఏకధాటిగా ఫైరింగ్ కొసాగింది. దీంతో స్థానిక ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. అటు ఎల్వోసీలో కూడా బాంబులు పడ్డ శబ్దాలు వినిపించాయి. మరోవైపు అరేబియా సముద్రం నుంచి పాకిస్తాన్ లోని మఖ్య నగరాలపై ఇండియన్ నేవీ మెరుపు దాడులు చేస్తోంది. 

అంతర్జాతీయ సరిహద్దు నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్‌లోని పఠాన్‌కోట్ లో కూడా పాకిస్తాన్ దాడులు నిర్వహించింది.   జమ్మూ, పఠాన్‌కోట్ , ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలను పాక్ డ్రోనులు దాడులు చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే అన్నింటినీ భారత ఆర్మీ సమర్థవంతంగ తిప్పికొట్టింది. 

బ్లాక్ అవుట్..

పాకిస్తాన్ తో బోర్డర్ షేర్ చేసుకుటున్న భారత సరిహద్దు ప్రాంతాలన్నీ రాత్రంతా బ్లాక్ అవుట్ లో గడిపాయి. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలు  పూర్తిగా బ్లాక్‌అవుట్ అయ్యాయి. పంజాబ్‌లోని చండీగఢ్, ఫిరోజ్‌పూర్, మొహాలి , గురుదాస్‌పూర్ లతో పాటూ  రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా బ్లాక్‌అవుట్ ప్రకటించబడింది. గుజరాత్‌లో కూడా బ్లాక్‌అవుట్ ప్రకటించబడింది. ఈ ప్రాంతాల్నీ రాత్రంతా చీకటిలోనే బతికాయి. 

 

 today-latest-news-in-telugu | india | pakistan | war

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు