Shaksgam Valley: పాక్‌-చైనా కు బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. సంచలన ప్రకటన!

 షక్సాగామ్‌ వ్యాలీపై భారత్, చైనా మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్‌ చైనాకు బిగ్ షాకిచ్చింది. ఈ ప్రాంతం తమ దేశంలోని భాగమేనని చైనా చేసిన వాదనను భారత్‌ మరోసారి ఖండించింది.

New Update
india again rejects china claim over shaksgam valley

india again rejects china claim over shaksgam valley

 షక్సాగామ్‌ వ్యాలీపై భారత్, చైనా మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్‌ చైనాకు బిగ్ షాకిచ్చింది. ఈ ప్రాంతం తమ దేశంలోని భాగమేనని చైనా చేసిన వాదనను భారత్‌ మరోసారి ఖండించింది. 1963లో పాక్, చైనా మధ్య ఈ వ్యాలీ అప్పగింతకు సంబంధించి జరిగిన ఒప్పందం చట్టవిరుద్ధమని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన దీనిపై మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. 

Also Read: ట్యాక్స్‌ నుంచి రియల్ ఎస్టేట్ వరకు.. ఈ బడ్జెట్ పై ఉన్న 10 టాప్ అంచనాలివే!

1963లో షక్సాగామ్ వ్యాలీని పాకిస్థాన్‌ అక్రమంగా చైనాకు అప్పగిస్తూ చేసుకున్న ఒప్పందం చెల్లదన్నారు. ఈ ప్రాంతంలో జరిగే ఎలాంటి కార్యకలాపాలను కూడా తాము గుర్తించమని స్పష్టం చేశారు. చైనా-పాక్ ఆర్థిక కారిడార్ విషయంలో ఈ రెండు దేశాలు కలిసి చేస్తున్న చట్టవిరుద్ధమైన చర్యగానే భావిస్తామని తేల్చిచెప్పారు. 

ఇదిలాఉండగా షక్సాగామ్ వ్యాలీ ప్రాంతంలో చైనా చేపట్టిన అభివృద్ధి పనులపై జనవరి 9న భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాక్-చైనా చెబుతున్న 1963 నాటి సరిహద్దు ఒప్పందాన్ని మేము ఎప్పటికి గుర్తించమని తెలిపింది. షక్సాగామ్ వ్యాలీ భారత్‌లో భాగమేనని స్పష్టం చేసింది. భారత్ చేసిన ప్రకటనపై చైనా కూడా స్పందించింది. ఈ ప్రాంతం తమ దేశంలో భాగమేనని.. ఇక్కడ తాము చేపడుతున్న అభివృద్ధి పనులపై భారత్‌కు అభ్యంతరం చెప్పే ఛాన్స్ లేదని తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా  భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ వ్యవహారంపై స్పందించారు. 

Also Read: టార్గెట్ ఇరాన్...భారత్ పై భారీ ఎఫెక్ట్..75 శాతం తప్పవేమో

షక్సాగామ్‌ వ్యాలీ అనేది భారత్, పాకిస్తాన్,  చైనాల మధ్య ఉన్న ఒక సంక్లిష్టమైన ప్రాంతీయ వివాదం. దీన్ని 'ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్' అని కూడా పిలుస్తారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పాక్ దీన్ని ఆక్రమించుకుంది. ఆ తర్వాత 1963లో దీన్ని అక్రమంగా చైనాకు అమ్మేసింది. వాస్తవానికి భారత్‌కు చెందిన ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఇతర దేశానికి ఇవ్వడం అనేది చట్టవిరుద్ధం. ఈ వ్యాలీని చైనాకు అప్పగించడం వల్ల పాక్‌తో చైనాకు రహదారి సౌకర్యం ఏర్పడింది. దీని నుంచే చైనాకు చెందిన భారీ యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు పాక్‌కు రవాణా అవుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు