Karnataka: భార్యకు అనారోగ్య సమస్యలు.. చెప్పకుండా పెళ్లి చేశారని..అనస్తీషియా ఇచ్చి...

భార్యకు అనారోగ్య సమస్యలున్న విషయాన్ని దాచి పెళ్లి చేసినందుకు ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. వైద్య వృత్తినే ఆయుధంగా మలుచుకుని చికిత్స పేరుతో అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి భార్యను హత్య చేశాడు.ఈ కేసులో బాధితురాలు కూడా డాక్టర్‌ కావడం గమనార్హం.

New Update
His wife had health problems. They said they got married without telling her.

His wife had health problems

Karnataka:  భార్యకు అనారోగ్య సమస్యలున్న విషయాన్ని దాచి పెళ్లి చేసినందుకు ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. వైద్య వృత్తినే ఆయుధంగా మలుచుకుని చికిత్స పేరుతో అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి భార్యను హత్య చేశాడు.ఈ కేసులో బాధితురాలు కూడా డాక్టర్‌ కావడం గమనార్హం. అయితే ఫోరెన్సిక్ నివేదికతో అసలు విషయం బయటపడడంతో ఆరు నెలల తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

బెంగళూరు లోని మారతహళ్లి ఠాణా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహేంద్ర రెడ్డి, కృతికా రెడ్డి ఇద్దరూ వైద్యులు. వీరిద్దరూ బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో పని చేస్తున్నారు. కృతికా రెడ్డి డెర్మటాలజిస్ట్ కాగా మహేందర్ రెడ్డి జనరల్‌ సర్జన్‌. ఇద్దరూ వైద్యులు కావడం, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం అందులోనూ ఒకే ఆస్పత్రిలో పని చేస్తుండటంతో.. వారి తల్లిదండ్రులు ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈక్రమంలో 2024 మే 26వ తేదీన కృతిక, మహేందర్ రెడ్డిల వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లై సంవత్సరం కూడా కాకముందే.. కృతికా రెడ్డి మరణించడం సంచలనం రేపింది.

కృతికా రెడ్డికి అజీర్ణం, షుగర్, గ్యాస్ట్రిక్ వంటి అనారోగ్య సమస్యలున్నాయి. ఈ విషయాన్ని వరుడి దగ్గర దాచి ఈ వివాహం చేశారు. పెళ్లైన తర్వాత దీని గురించి మహేందర్ రెడ్డికి తెలిసింది. కృతికకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి తన వద్ద దాచి.. ఆమెని తనకిచ్చి పెళ్లి చేశారని తీవ్రంగా రగిలిపోయాడు మహేందర్ రెడ్డి.. ఏకంగా భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన వైద్య వృత్తినే వినియోగించుకోవాలనుకున్నాడు. ఇదిలా ఉండాగానే అనారోగ్యం సమస్యలతో కృతికా మారతహళ్లిలోని తన తల్లిదండ్రులకు వద్దకు వెళ్లింది. దీంతో మహేంద్ర రెడ్డి ఆమెను పరామర్శించడానికి మారతహళ్లికి వెళ్లాడు. ఆ తర్వాత అక్కడే ఉంటూ కృతికా రెడ్డికి తనే స్వయంగా ట్రీట్‌మెంట్‌ చేశాడు. దీనిలో భాగంగా ఆపరేషన్ థియేటర్లలో మాత్రమే వినియోగించే.. ప్రొపోఫోల్ అనే మత్తు మందును ఆమెకు ఓవర్ డోస్ ఇస్తూ వస్తున్నాడు. ఈక్రమంలో ఈఏడాది అనగా 2025, ఏప్రిల్ 23న కృతిక ఆరోగ్యం విషయమించింది. శ్వాస తీసుకోలేని స్థితికి చేరింది. దీంతో ఆమెని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కృతిక చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.


అయితే మొదట్లో కృతికది సహజ మరణంగా భావించారు. అనారోగ్య సమస్యలతో ఆమె మరణించిందని భావించి, పోస్ట్‌మార్టం నిర్వహించారు.అనారోగ్య కారణాల వల్లే ఆమె చనిపోయి ఉంటుందని పోలీసులు కూడా నమ్మారు. ఈక్రమంలో అన్నేచురల్ డెత్ రిపోర్ట్‌గా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మహేదర్ రెడ్డి మణిపాల్ వెళ్లాడు. అక్కడే క్లినిక్ తెరిచాడు. అయితే కృతిక మృతి మీద ఆమె అక్క, రేడియాలజిస్ట్ అయిన డాక్టర్ నిఖితా రెడ్డికి అనుమానం వచ్చింది. ఆమె సమగ్ర విచారణకు పట్టుబట్టింది. దీంతో ఆరు నెలల తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక వెలుగులోకి వచ్చింది. కృతిక శరీరంలో అనేక అవయవాల్లో ప్రొపోఫోల్ ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలింది. దీని కారణంగానే ఆమె మరణించిందని స్పష్టంగా రుజువైంది. దీంతో మారతహళ్లి పోలీసులు.. మణిపాల్ వెళ్లి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించారు. ఈక్రమంలో తానే కృతికకు అనస్తీషియా ఓవర్‌ డోస్‌ ఇచ్చి హత్య చేసినట్లు  నేరాన్ని అంగీకరించాడు.

ఇది కూడా చూడండి: Telangana News: ప్రభుత్వానికి షాక్‌..తెలంగాణ ద్రవ్యోల్బణం ఢమాల్

Advertisment
తాజా కథనాలు