/rtv/media/media_files/2025/04/30/KYvs4UsUNsVP55Yvn8M2.jpg)
IAS Ashok Khemka is retiring today
IAS Ashok Khemka: సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా నేడు పదవి విరమణ చేస్తున్నారు. తన 34 ఏళ్ల సర్వీస్లో 57సార్లు బదిలీ కాగా రాబర్ట్ వాద్రాతో ముడిపడి ఉన్న గురుగ్రామ్ భూ ఒప్పందాన్ని రద్దు చేయడంతో జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. మొదట డైరెక్టర్ జనరల్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన రికార్డులను పరిశీలిద్దాం.
Senior IAS officer #AshokKhemka, known for his stringent anti-corruption stance during his 34-year career marked by 57 transfers, is set to retire from his position as additional chief secretary of the Transport Department in #Haryana
— The Times Of India (@timesofindia) April 30, 2025
More details 🔗 https://t.co/ozzbjEqRxq pic.twitter.com/yB3r8XpvV6
ఆరు నెలలకు ఒక కొత్త శాఖకు..
హర్యానా 1991 బ్యాచ్ కేడర్ కు చెందిన ఆయన.. రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా తన సేవలకు ముగింపు పలికారు. మొదట డైరెక్టర్ జనరల్గా, ఆ తరువాత ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. అయితే గత 12ఏళ్లలో ఆయనకు 'లో-ప్రొఫైల్' విభాగాలను కేటాయించారు. 2013లో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, మూడుసార్లు బీజేపీ పాలనలో ఆయన ఆర్కైవ్స్ విభాగానికి నాలుగుసార్లు విధులు నిర్వర్తించారు. 2012లో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాతో ముడిపడి ఉన్న గురుగ్రామ్ భూ ఒప్పందాన్ని రద్దు చేయడంతో జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. సగటున ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త శాఖకు బదిలీకావడం విశేషం. కాగా హర్యానాలో అత్యధిక బదిలీల ఘనత ఈయనకే దక్కింది.
Na kaam karenge, na karne denge.
— meghna jalan (@meghnajalan) April 29, 2025
All politicians are the same.
IAS officer Ashok Khemka, transferred 57 times in 34 years, to retirehttps://t.co/ln0eBCSJvS pic.twitter.com/eHm6RrdPWS
అవినీతిని రూపుమాపడానికి ప్రయత్నిస్తా..
2023లో రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి నాయకత్వం వహించడానికి ఖట్టర్కు లేఖ రాయడం సంచలనం రేపింది. అందులో అవినీతిని నిర్మూలించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. 2023 జనవరి 23 నాటి లేఖలో.. బ్యూరోక్రసీలో పని పక్షపాత ధోరణిని ఆయన విమర్శించారు. కొంతమంది అధికారులపై అధిక భారం ఉందని, తనతో సహా ఇతరులకు ఆర్కైవ్స్ వంటి విభాగాలలో పెద్దగా సంబంధం లేదని అన్నారు. 'పనిని పక్కకు పెట్టడం వల్ల ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడదు. విజిలెన్స్ విభాగానికి అధిపతిగా నా సేవా జీవితం చివరి దశలోనైనా అవినీతిని రూపుమాపడానికి ప్రయత్నిస్తాను. అవకాశం దొరికినప్పుడల్లా అవినీతికి వ్యతిరేకంగా నిజమైన యుద్ధం కొనసాగిస్తా. ఎంత ఉన్నతమైన, శక్తివంతమైన వ్యక్తి అయినా తప్పించుకోడు. ఇది మీకు హామీ ఇస్తున్నా' అంటూ తన అభిప్రయాన్ని నిర్మొహమాటంగా చెప్పేశారు.
Also Read: సింహాచలం చందనోత్సవంలో విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
రెండేళ్ల క్రితం ఐఏఎస్ అధికారుల పదోన్నతులకు సంబంధించి ఇలా ట్వీట్ చేశారు. 'భారత ప్రభుత్వానికి కొత్తగా కార్యదర్శులుగా నియమితులైన నా బ్యాచ్మేట్లకు అభినందనలు! ఇది ఆనందించడానికి ఒక సందర్భమే అయినప్పటికీ, ఒకరు వెనుకబడిపోయారనే నిరాశను కూడా అంతే స్థాయిలో తెలియజేస్తుంది. సరళమైన చెట్లను ఎల్లప్పుడూ ముందుగా నరికివేస్తారు. అయినా ఎలాంటి విచారం లేదు. కొత్త సంకల్పం, పట్టుదలతోనే ఉంటాను' అన్నారు.
Also Read: పహల్గామ్ దాడి...భారత్ కు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ వార్నింగ్
1965లో కోల్కతాలో జన్మించిన ఖేమ్కా.. ఐఐటీ ఖరగ్పూర్ (1988) నుంచి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) నుండి కంప్యూటర్ సైన్స్లో PhD, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్లో స్పెషలైజేషన్లతో MBA పట్టా పొందారు. నిరంతర అభ్యాసానికి నిబద్ధతను ప్రదర్శిస్తూ ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి LLB కూడా పొందారు.
retirement | telugu-news | today telugu news