/rtv/media/media_files/2025/04/24/vQ153XcUzzXZZr6PTn2k.jpg)
PM Modi
ప్రధాని మోదీ ప్రస్తుతం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అక్కడ ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన స్వదేశీ వస్తువుల వాడకంపై మాట్లాడారు. భారత్ మార్కెట్లను ముంచేస్తున్న విదేశీ వస్తువులపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చైనా ఉత్పత్తులపై. మన దేశంలో అన్నీ తయారవుతున్నాయి అని...ప్రజలు వాటినే వాడేందుకే ప్రాముఖ్యతను ఇవ్వాలని మోదీ కోరారు. వినాయకుడి విగ్రహాలను సైతం విదేశాల నుంచే తెచ్చుకుంటున్నామన్న ఆయన.. లాభాల మాట అటుంచి విదేశీ వస్తువుల్ని విక్రయించమని గ్రామస్థాయి నుంచి వ్యాపారులు ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
మన పండుగలలో విదేశీ వస్తువులు..
వినాయకచవితి, హోలీ, దీపావళి ఇలా మన పండలన్నింటిలో విదేశీ వస్తువులు వచ్చి కూర్చొంటున్నారు. మన వినాయకుడిని వేరే దేశం వాళ్ళు తయారు చేయడమేమటి? కళ్ళు, ముక్కు సరిగ్గా లేకపోయినా వాటిని మనం కొనుక్కోవడం సరికాదని ప్రధాని అన్నారు. కొన్నేళ్లుగా పండుగ విక్రయాల్లో విదేశీ వస్తువులదే ఆధిపత్యం ఉంటోంది. ఇది స్థానిక కళాకారులు, తయారీదారులపై ప్రభావం చూపిస్తోంది అని అన్నారు. మన దేశం స్వయం సమృద్ధి సాధించాలంటే మన వస్తువులనే వాడాలని మోదీ చెప్పారు. మన ఇళ్ళల్లో తిష్ట వేసుకుని కూర్చొన్న విదేశీ వస్తువులను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
today-latest-news-in-telugu | pm modi | make-in-india
Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!