/rtv/media/media_files/2025/06/07/ADohShk6xGLE7chFTFXE.jpg)
Diamonds
భారత్కు గుడ్ న్యూస్ అందింది. మధ్యప్రదేశ్లోని ఏకంగా రూ.70 వేల కోట్లకు పైగా విలువ గల వజ్ర నిక్షేపాలు బయటపడ్డాయి. ఛతర్పుర్ జిల్లాకు 100 కిలోమీటర్ల దూరంలోని బక్స్వాహా అడవుల్లో ఈ నిల్వలను రెండు దశాబ్దాలు క్రితమే గుర్తించారు. ఆ సమయంలో అక్కడి భూగర్భంలోని 6 వేల కిలోలకు పైగా వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు చెప్పారు. ఆరోజుల్లో వాటి మార్కెట్ విలువ రూ.55 వేలు ఉంటుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు వాటి విలువ రూ.70 వేల కోట్లకు పైగానే ఉంది.
Also Read: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. తల్లీబిడ్డకు ప్రాణం పోసిన ప్రైవేట్ హాస్పిటల్
ఇక వివరాల్లోకి వెళ్తే.. రియో టింటో అనే బ్రిటిష్ ఆస్ట్రేలియన్ బహుళజాతి సంస్థ ఉంది. ఈ కంపెనీ 20 ఏళ్ల క్రితమే (2000--2005) మధ్యప్రదేశ్లో బక్స్వాహా అడవుల్లో సర్వే నిర్వహించింది. అక్కడ బందర్ డైమండ్ అనే నిర్దిష్ట బ్లాకు పరిధిలో తవ్వకాలు జరిగింది. ఆ ప్రదేశంలోని భూగర్భంలో దాదాపు 3 కోట్ల క్యారెట్ల విలువైన వజ్ర నిక్షేపాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.
Also Read: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్లైన్లో రూ.3.85 కోట్లు స్వాహా
మరోవైపు అప్పట్లో ఈ తవ్వకాల వద్ద వివాదాలు కూడా తలెత్తాయి. దీంతో బక్స్వాహా అడువుల డైమండ్ మైనింగ్పై పులువురు మధ్యప్రదేశ్లో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ తవ్వకాలపై హైకోర్టు స్టే విధించింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆసియా ఖండంలోనే ఇంత భారీగా వజ్ర నిక్షేపాలు ఇంతవరకు ఎక్కడ బయటపడలేదు. మన దేశంలోని మధ్యప్రదేశ్లో వీటిని గుర్తించడం విశేషం. ఇప్పుడు ఆ వజ్రాల విలువ ఏకంగా రూ.70 వేల కోట్లకు పెరగడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: ఆ కామాంధుడు ట్రంప్పై 34 కేసులు.. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఇదే!!
telugu-news | rtv-news | madyapradesh