/rtv/media/media_files/2025/05/18/nTyjLljztrM2MHwZw5VJ.jpg)
Earthquake
Earthquake : మళ్లీ దేశంలో భూప్రకంపనలు ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత దాదాపు 3.2 గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నివేదిక ప్రకారం జూలై 22న ఉదయం 6:08 గంటలకు 3.2 తీవ్రతతో భూకంప ప్రకంపనలు సంభవించాయి.
Also Read: లోక్సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా
భూకంప కేంద్రం భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో ఉందని చెబుతున్నారు. ఫరీదాబాద్ను భూకంపం కుదిపేసింది. నిద్రలోంచి పూర్తిగా మేల్కొక ముందే తెల్లవారుజామున ఇళ్ళు కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో ఢిల్లీలోనూ స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి.
Also Read:ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే