/rtv/media/media_files/2025/05/28/3jspnhAPZkrpjVV0NSE2.jpg)
Operation Sindoor
Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడి తర్వాత మే 7న మన సైన్యం పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై చేసిన మెరుపుదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత్ విరుచుకుపడింది. కాగా ఈ సందర్భంగా భారత్ సైన్యం తమ సోషల్ మీడియా హ్యాండిల్లో సిందూరం లోగోతో కూడిన ఆపరేషన్ సిందూర్ అనే పోస్టర్ను పెట్టారు. కాగా ఈ లోగోను రూపొందించింది ఎవరా? అని చాలామంది ప్రశ్నించుకున్నారు. నిజానికి దీన్ని ప్రభుత్వం డిజైన్ చేసింది అనుకున్నారు. కానీ దీనికి రూపకల్పన చేసింది భారత సైనికులు అంటే ఆశ్చర్యం వేస్తుంది.
ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
భారతదేశం పాకిస్థాన్ పై 25 నిమిషాల పాటు మెరుపులు దాడులు చేసింది. ఆ తర్వాత ఆర్థరాత్రి 1.51 గంటలకు ఆపరేషన్ సిందూర్ అనే పోస్టర్ను పోస్టు చేసింది ఇండియన్ ఆర్మీ. అయితే మన జవాన్ల శౌర్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆపరేషన్కు అంకితమిస్తూ ఇండియర్ ఆర్మీ పత్రిక బాత్చిట్(మాటామంతీ) తాజా సంచిక వెలువడింది. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ కర్నల్, హర్ష్గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్ ఆపరేషన్ సిందూర్ లోగోను రూపొందించినట్లు ఆ పత్రిలో పేర్కొన్నారు.
Also Read: కొచ్చి తీరంలో హై అలర్ట్..మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..?
దీంతో ఇప్పటివరకు ప్రభుత్వం, ఇతర వ్యక్తులు లోగోను రూపొందించారని జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ సైన్యం క్లారిటీ ఇవ్వడంతో ప్రచారానికి తెరపడింది.
Also Read : Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్తో రొమాన్స్కి బోల్డ్ బ్యూటీ
Also Read : BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్లోనే