మహిళలకు గుడ్‌న్యూస్‌.. నెలకు రూ.2500 స్కీమ్‌ ప్రారంభం

ఢిల్లీ ప్రభుత్వం మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా 'మహిళా సమృద్ధి యోజన' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. శనివారం నిర్వహించిన కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
Delhi govt approves Mahila Samriddhi Yojana allocates 5100 crores for scheme

Delhi govt approves Mahila Samriddhi Yojana allocates 5100 crores for scheme

ఢిల్లీ ప్రభుత్వం మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళా దినోత్సవం సందర్భంగా 'మహిళా సమృద్ధి యోజన' పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. శనివారం నిర్వహించిన కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.'' మహిళా దినోత్సవం సందర్భంగా కేబినెట్‌ సమావేశం నిర్వహించాం. ఇందులో భాగంగా మా సోదరీమణులకు ఇచ్చిన హామీ మేరకు మహిళా సమృద్ధి యోజన పథకానికి ఆమోదం తెలిపాం. ఈ పథకం కింద ఢిల్లీ మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం అందించేందుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

Also Read: ఎంతకు తెగించార్రా.. ఛావా మూవీ చూసి టార్చిలైట్లతో నిధుల వేటకు!

ఈ పథకం అమలు కోసం బడ్జె్‌ట్‌లో రూ.5100 కోట్లు కేటాయించాం. ఈ స్కీమ్‌ అమలును పర్యవేక్షించేందుకు తన నేతృత్వంలో మంత్రులు ఆశిష్‌ సూద్‌, పర్వేష్‌ వర్మ, కపిల్‌ మిశ్రాలతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. దరఖాస్తులు, లబ్ధిదారుల గుర్తింపు కోసం ఒక పోర్టల్‌ ప్రారంభించనున్నాం. మహిళల సంక్షేమం, భద్రత కోసం నేను కృషి చేస్తున్నాను. ఢిల్లీలో చిన్న టాయిలెట్లను కూడా మహిళల కోసం నిర్మించాం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది మోదీ ప్రభుత్వమేనని'' రేఖా గుప్తా అన్నారు. 

Also Read: హిందీని బలవంతంగా రుద్దడం లేదు.. నారా లోకేశ్‌ సంచనల వ్యాఖ్యలు

 ఇదిలాఉండగా మహిళా సమృద్ధి యోజన స్కీమ్‌ కింద ఆర్థికంగా వెనకబడిన బలహీన వర్గాలకు చెందిన ఢిల్లీ మహిళలకు మా ప్రభుత్వం నెలకు రూ.2500 అందించనుంది. మార్చి 8న నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఈరోజు నుంచే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఈ స్కీమ్‌కు ఢిల్లీ కేబినెట్‌ ఇప్పటికే ఆమోదం తెలిపి.. రూ.5100 కోట్ల నిధులు కేటాయించింది. 21 నుంచి 60 ఏళ్లు కలిగిన  మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read: ఈరోజు స్పెషల్ ఇదే.. మహిళల చేతికి మోదీ సోషల్ మీడియా అకౌంట్లు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు