Delhi car blast: ఢిల్లీ పేలుడు ఘటన ఉగ్రవాద చర్యే..కేంద్రం సంచలన ప్రకటన

ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటన ఉ‍గ్రవాదుల చర్యేనని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేబినెట్‌ సమావేశంతో పాటు కేంద్ర భద్రతా మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో ఎర్రకోట పేలుళ్లు,ఉగ్రవాద నిర్మూలనపై ప్రత్యేక చర్చ జరిగింది.

New Update
FotoJet (80)

Central Security Council

Delhi car blast: ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటన ఉ‍గ్రవాదుల చర్యేనని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేబినెట్‌ సమావేశంతో పాటు కేంద్ర భద్రతా మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో ఎర్రకోట పేలుళ్లు,ఉగ్రవాద నిర్మూలనపై ప్రత్యేక చర్చ జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్‌ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా పెలుడు ఘటన మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్‌.. మృతులకు సంతాపం తెలిపింది. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కేంద్ర కేబినెట్‌ తీర్మానించింది. ఉగ్రవాదాన్ని జీరో టోలరెన్స్ విధానంతో అణిచివేస్తామని కేబినెట్‌ కీలక ప్రకటన చేసింది. ఘటనకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి.. శిక్షిస్తామని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

ఈ భేటీలో కారు పేలుడు ఘటనలో తదుపరి కార్యచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు, అంతర్గత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు,  కేంద్ర మంత్రివర్గంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. CCS సమావేశానికి అధ్యక్షత వహించే ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రెండు రోజుల భూటాన్ పర్యటన నుండి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే, ఎర్రకోట కారు పేలుడులో గాయపడిన వారిని పరామర్శించడానికి ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (LNJP) ఆసుపత్రిని సందర్శించారు. రాజధానిలో దిగిన వెంటనే, ప్రధానమంత్రి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు, అక్కడ గాయపడిన వారితో మాట్లాడి, వారి పరిస్థితి గురించి అడిగి, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీనియర్ వైద్యులు మరియు అధికారులు బాధితుల ఆరోగ్య స్థితి మరియు అందిస్తున్న చికిత్స గురించి ఆయనకు వివరించారు.

సోమవారం సాయంత్రం లాల్ క్విలా మెట్రో స్టేషన్ సమీపంలో హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన శక్తివంతమైన పేలుడులో కనీసం 12 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు.ప్రాథమిక పోస్ట్‌మార్టం ఫలితాల ప్రకారం, బాధితులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి,  కార్లు, పలు –రిక్షాలు, ఆటోలు సైతం తీవ్రస్థాయిలో ధ్వంసమయ్యాయి. దీంతో మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన సమీపంలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆస్పత్రిలో చేర్పించారు.  

ఇది కూడా చూడండి: Maoists Encounter: మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్.. ఛత్తీష్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్

Advertisment
తాజా కథనాలు