China shocking :  చైనా షాకింగ్ నిర్ణయం.. భారత్ లో 21 వేల మంది ఉద్యోగులు ఔట్.. కారణమిదే!?

రేర్‌ ఎర్త్‌ లోహాల ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షల మూలంగా దేశీయంగా ఆడియో ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 21,000కు పైగా ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడింది. దీన్ని పరిశ్రమ సమాఖ్య అయిన ఎల్సినా కూడా నిర్ధారిస్తోంది.

New Update
Audio Electronics

Audio Electronics

China shocking : రేర్‌ ఎర్త్‌ లోహాల ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షల మూలంగా దేశీయంగా ఆడియో ఎలక్ట్రానిక్స్‌ రంగంలో 21,000కు పైగా ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడింది. దీన్ని పరిశ్రమ సమాఖ్య అయిన ఎల్సినా కూడా నిర్ధారిస్తోంది. చైనా వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌ పరికరాల్లో వినియోగించే ఎన్‌డీఎఫ్‌ఈబీ (నియోడైమియం-ఐరన్‌-బోరాన్‌) మ్యాగ్నెట్ల తయారీకి వాడే టెర్బియం, డిస్పోర్సియం వంటి రేర్‌ ఎర్త్‌ లోహాల ఎగుమతులకు సంబంధించి  గత ఏప్రిల్‌లో కఠిన లైసెన్సింగ్‌ నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది.

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
 
 ఈ నిబంధనల మూలంగా అంతర్జాతీయంగా వీటి సరఫరాలో అవాంతరాలు ఏర్పడ్డాయి.  ఆడియో పరికరాలు (హియరబుల్స్‌), వేరబుల్స్‌ తయారీలో వీటిని మనదేశంలోనూ వినియోగిస్తున్నారు. అయితే కఠిన లైసెన్సింగ్‌ విధానం వల్ల వీటి సరఫరా లేక, ఆయా పరికరాల తయారీ నిలిచిపోయింది. ఫలితంగా నోయిడా, దక్షిణాది రాష్ట్రాలో ఉన్న స్పీకర్, ఆడియో పరికరాల తయారీ కంపెనీల్లో ప్రత్యక్షంగా ఐదునుంచి ఆరువేల ఉద్యోగాలు, పరోక్షంగా 15 వేల ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఏర్పడింది. పరికరాల తయారీదార్లు చైనా నుంచి పూర్తిగా అసెంబుల్‌ చేసిన స్పీకర్‌ మాడ్యూళ్లను దిగుమతి చేసుకుంటుండంతో ఇక్కడి తయారీ దార్లకు పనులు లేకుండా పోయాయి. 

Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?

మరోవైపు పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. ఇవి మన దేశంలో నియామకాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని  స్టాఫింగ్‌ సొల్యూషన్స్, మానవ వనరుల సేవల సంస్థ జీనియస్‌ కన్సల్టెంట్స్‌ తాజా నివేదిక వెల్లడించింది. ఇప్పుడున్న అననుకూల వాతావరణంలో చాలా సంస్థలు నియామకాలను ఆపేయడం, లేదా ఉన్న వారిని తగ్గించడం చేస్తున్నాయి. ప్రస్తుత కంపెనీల్లో సుమారు 15 శాతం కంపెనీలు ఔట్‌సోర్సింగ్‌, ఫ్రీలాన్స్‌ సేవల ఉద్యోగాల వైపు దృష్టి సారిస్తున్నాయని నివేదిక తేల్చింది. గతనెల 12 నుంచి ఈనెల 6 మధ్య దేశంలోని వివిధ రంగాల్లో పని చేస్తున్న 2,006 మంది ఉద్యోగులను ఆన్‌లైన్‌లో సర్వే చేసిన ఈ సంస్థలు తమ తుది నివేదికను వెల్లడించాయి. భౌగోళిక, రాజకీయ అస్థిరత్వం మూలంగా తమ వేతన వృద్ధి, బోనస్‌లు, పదోన్నతుల వంటివి ఇరకాటంలో పడ్డాయని సర్వేలో పాల్గొన్న వారిలో 36%  మంది ఉద్యోగులు అభిప్రాయ పడినట్లు నివేదిక వెల్లడించింది.

Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?

Advertisment
Advertisment
తాజా కథనాలు